Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ర్యాట్ రేస్ హీరోలకు పంచ్ ఇచ్చిన....అల్లు శిరీష్!
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడు అల్లు శిరీష్ త్వరలో 'గౌరవం' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాక ముందు నుంచే అల్లు శిరీష్ నిర్మాత తనయుడిగా, కొంత కాలం పాటు సినీ మేగజైన్ నడిపిన వ్యక్తిగా, మెగాఫ్యామిలీకి చెందిన మనిషిగా గుర్తింపు పొంది సెలబ్రిటీల లిస్టులో చేరిపోయాడు.
సోషల్ నెట్వర్కింగ్ సైట్లో చాలా యాక్టివ్గా ఉంటూ....తరచూ ఆసక్తిర, తలబిరుసు కామెంట్స్ చేసే అల్లు శిరీష్ మరోసారి అలాంటి వ్యాఖ్యాలే చేసాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'మా అన్నయ్య అల్లు అర్జున్ తొలి సినిమా నుండి చాలా కష్ట పడుతున్నాడు. పరిశ్రమలో తన స్థానం పదిలపరుచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. మా కజిన్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదు, నేను ఈ ర్యాట్ రేస్లో లేను, నేను డిఫరెంట్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను' అంటూ వ్యాఖ్యానించాడు.
అల్లు శిరీష్ 'గౌరవం' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్గా నటిస్తోంది. రాధా మోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషల్ డ్రామా... హ్యూమన్ టచ్ తో కూడి ఉంటుంది. ఓ సిటీ కుర్రాడు... తన స్నేహితుడుని వెతుక్కుంటూ ఓ విలేజ్ కు వెళ్లతాడు. అక్కడ అసలు భారతీయ గ్రామం స్వరూపం చూడటం జరుగుతుంది. అక్కడ జరిగే పరిణామాల సమాహారమే గౌరవం చిత్రం. ప్రకాశ్రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.