Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
కోర్టు తీర్పును గౌరవిస్తా: హీరో గోవిందా
ముంబై: కోర్టు తీర్పు ఏదైనా సరే.. దాన్ని గౌరవిస్తానని ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా అన్నారు. ఓ వ్యక్తిని కొట్టిన కేసులో క్షమాపణ చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు గోవిందాను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గోవిందా మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అహంభావం లేదని, అంతేగాక కోర్టు తీర్పును ఎల్లప్పుడూ గౌరవిస్తానని తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళితే...ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2008లో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన కేసులో బాధితుడికి క్షమాపణలు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఈ హీరోకు సూచించింది.
గోవిందా గతంలో సంతోష్ రాయ్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన కేసును ముంబయి హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాయ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జస్టిస్ టి.ఎస్.ఠక్కర్ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో క్లిప్లను పరిశీలించిన తర్వాత గోవిందాకు ఈ సూచన చేసింది. రీల్లైఫ్ లో చేసినట్లు రియల్ లైఫ్లో చేయకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
'మేము మీ సినిమాలను చూసి ఆనందిస్తాం.. కానీ మీరు ఇలా నిజజీవితంలో ఎవరినైనా చెంపదెబ్బ కొడితే హర్షించలేము'అని ఆయన అన్నారు. ప్రజల మనిషిగా ఉండేవారు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోమని సలహా ఇచ్చారు. అనంతరం విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేశారు.