Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మాయాబజార్’ విజయోత్సవ వేడుక!
అలనాటి 'మాయాబజార్" చిత్రానికి రంగులు హంగులు దిద్ది గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ విడుదల చేయడం, ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం తెలిసిందే. రంగుల 'మాయాబజార్" 50 రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్బంగా ఈ చిత్ర అర్ధ శతదినోత్సవ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగేశ్వరరావు మాట్టాడుతూ మాయాబజార్ చిత్రాన్ని ప్రత్యేకించి ఇప్పుడు రంగులు చేయండం కాదు. ఈ చిత్రం ఎప్పుడూ కలర్ ఫుల్ చిత్రమే. ఈ చిత్రాన్ని రంగుల్లో చూసి నేను ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని ఒరిజినల్ కలర్స్ ని నేను సెట్ లోనే చూశాను అని అన్నారు. ఇంత మంచి ప్రయత్నం చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ వారిని ఈ సందర్బంగా అక్కినేని అభినందించారు. ఈ వేడుకలో భాగంగా గోల్డ్ స్టోన్ టెక్కాలజీ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ ఈ సినిమాను కలర్ లో చూసి చాలా ఆశ్చర్యపోయా అన్నారు. తర్వాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కలర్స్ లోనికి మార్చి ప్రేక్షకులను ఆనందపరచారన్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు 'మాయాబజార్ గురుంచి చెప్పుకుంటారిని బీ ఏ రాజు చెప్పారు. చివరిగా సి జగన్మోహన్ మాట్లాడుతూ 'మా ప్రయత్నాన్ని సఫలం చేసి ఈ అపురూప చిత్రాన్ని అపూర్వం గా ఆదరించిన ప్రేక్షకులకు దన్యవాదాలు" అని తెలిపారు.