Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
హీరో ఇంట్రడక్షన్లోనే నాలుగొందలమందిని ...
''నా స్వానుభవాలతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని అన్ని అంశాలూ నా జీవితంలోనివే కాకపోయినా... కొన్ని మాత్రం జరిగాయి. అలాగే నాకు తెలిసినవాళ్ల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని విషయాలని కూడా తీసుకొని ఈ కథ రాసుకొన్నాను. సాధారణంగా ఎదుటివ్యక్తిని ప్రేమించాలనుకొన్నప్పుడు అన్నీ మంచి పనులే చేస్తుంటారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకూ ఇష్టం అని చెప్పుకొన్నాక.... ఆ ఇద్దరూ కలిసి గడిపే సమయం కూడా పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఒకరిగురించి మరొకరికి ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి. అవి కొన్నిసార్లు లేనిపోని భయాలు, అనుమానాలకు కారణమవుతుంటాయి.
ఆ సమయంలోనే యువతరం ఆలోచనలో పడిపోతుంటుంది. నేను సరైన వ్యక్తినే ఎంచుకొన్నానా? నా నిర్ణయం సరైనదా కాదా? అనే సంఘర్షణకు గురవుతుంటారు. ఆ తరహా అనుభవాలతో కూడుకొన్న కథే ఇది. అనిల్, అనన్య అనే ఓ జంట నేపథ్యంలో సాగుతుంది. ప్రేమకథల్లో చాలావరకు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇది తప్పు, ఇలా చెయ్ అని చెప్పడం చూసుంటాం. ఇందులో తల్లితండ్రుల పాత్రలు మాత్రం భిన్నంగా ఉంటాయి. వారు యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన తప్పులేమిటి? ఆ ప్రభావం పిల్లలపై ఎలా పడింది? వారి జీవితానుభవాల్ని పిల్లలతో పంచుకొనే అవసరం ఎందుకొచ్చింది? అనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. మొత్తంగా ప్రేమికులు, వారి తల్లిదండ్రులతో కలుపుకొని ఇది మూడు జంటల మధ్య జరిగే కథ అని చెప్పొచ్చు అని తాజా చిత్రం కథ గురించి వివరించారు.
అలాగే... ''నేను తీసిన మొట్టమొదటి రొమాంటిక్ ప్రేమకథ ఇది. నేను సొంతంగా రాసుకొన్న కథతోనే ఈ సినిమాని తెరకెక్కించా. ఇదివరకు నేను తీసిన చిత్రాలు వేరొకరు ఇచ్చిన కథలతోనే తీశాను. 'అష్టాచమ్మా' చిత్రం కూడా ఓ ఇంగ్లీషు నవల స్ఫూర్తితో రాసుకొన్నదే. ఎప్పటికప్పుడు ఓ వైవిధ్యమైన కథని ఎంచుకొని ప్రయాణం చేయడమంటేనే నాకు ఇష్టం. అప్పుడే దర్శకుడికి సంతృప్తి లభిస్తుందని నమ్ముతుంటా. 'గ్రహణం' నుంచి మొదలుపెడితే నేను తీసిన చిత్రాలకు ఒకదానికొకటి ఏ మాత్రం పోలిక కనిపించదు. సొంతంగా కథని తీర్చిదిద్దుకోవడం, దానికి తగ్గ నిర్మాతని వెదుక్కోవడం, ఆ తర్వాత నటీనటులను ఎంపిక చేసుకోవడం... ఇలా నాకు ఎక్కువగానే పని ఉంటుంది. అందుకే సినిమా సినిమాకీ మధ్య విరామం తీసుకొన్నట్టు అనిపిస్తుంటుంది. ఆ విషయంపై తనికెళ్ల భరణిగారు 'హేలీ తోకచుక్కలా ఏడేళ్లకోసారి కనిపిస్తావేంటి' అంటుంటారు అని వివరించారు.
వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో రవిబాబు, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఎస్.రవీందర్, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.