Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రతి గొట్టంగాడి గురించి ఎన్టీఆర్ పట్టించుకోవడం బాధేసింది: తమ్మారెడ్డి భరద్వాజ
ఎన్టీఆర్ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సద్విమర్శలు చేయని వారిని పట్టించుకోవదన్నారు.
సినిమా రివ్యూ రైటర్లపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మీద ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. దారినపోయే దానయ్యల్లాంటి సినీ విశ్లేషకులు ఎమర్జెన్సీ వార్డులో సినిమా ఉండగానే చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని, సినిమా చచ్చిందో లేదో తేల్చాల్సింది వైద్యం చేస్తున్న ప్రేక్షకులే అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ చేసిన ఈ మాటలకు బాధేసిందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమాలపై సరైన విమర్శలు చేయని వ్యక్తుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు అలాంటి వారిని పట్టించుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
ఎన్టీఆర్ చెప్పినట్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు. అసలు నేనంటాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? లేదా? అని మాట్లాడుకోవడం అనవసరం మనకు. సినిమా తీసిన తర్వాత అసలు అలాంటి వాళ్ల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
మంచి సినిమాను ప్రేక్షకుడు బ్రతికించుకుంటాడు
డాక్టర్ కానటువంటి వాడు పేషెంట్ చచ్చిపోతాడని అంటే.... అతడు చచ్చిపోతాడా? బతికించుకునే వాళ్లను డాక్టర్ బతికించుకుంటాడు. అలానే, మంచి సినిమాను ప్రేక్షకుడు బతికిస్తారు... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
ఎవడో గొట్టం గాడు అంట...
ఎవడో గొట్టం గాడు చెప్పాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గొట్టం గాడి మాట పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడటం టైమ్ వేస్ట్.... అని తమ్మారెడ్డి సూచించారు.
బావుంది, బాగోలేదని చెప్పడంలో తప్పులేదు
విమర్శకుడనే వాడు సద్విమర్శ చేయాలి. సినిమా బాగుంది.. బాగోలేదు. సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, బాగుండకపోతే ఎందుకు బాగోలేదో తన వరకు తాను ఎవరైనా చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు అని తమ్మారెడ్డి అన్నారు.
అలాంటి హక్కు విమర్శకుడికి లేదు
సినిమా ఎందుకు బాగోలేదో, ఎందుకు బావుందో విశ్లేషించే హక్కు మాత్రమే సినీ విమర్శకుడికి ఉంది. సినిమా ఫెయిల్ అయిపోయింది, లేక పోతే ఇన్ని కోట్లు వస్తాయి, డిపాజిట్లు రావు, పిండి ఖర్చులు రావు అని చెప్పే హక్కు లేదు, వాళ్లు అసలు విమర్శకులే కాదు అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
నిజంగా బాధేసింది
సద్విమర్శలు చేయని వారి గురించి మనం మాట్లాడుకోవడం, ఎన్టీఆర్ లాంటి పెద్దస్టార్ అలాంటి వారిని పట్టించుకోవడం అనేది నిజంగా బాధేసింది". అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.