Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘చట్టం’...నీ అబ్బ సొత్తా? నిలదీస్తున్న జగపతి బాబు
జగపతి బాబు, మదాల్సశర్మ జంటగా 'చట్టం" (నీ అబ్బ సొత్తా?) చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విశాఖ టాకీస్ పతాకంపై పి.ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో నట్టికుమార్, తుమ్మేపల్లి రామ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు క్లాప్ నివ్వగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత కెమెరాస్విచాన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ...ఈ చిత్రానికి ఇది యాప్ట్ టైటిల్. మన చట్టాల పట్ల అందరిలోనూ ఎన్నో ప్రశ్నలున్నాయి. అవి సరిగా అమలుకావనీ, నేరస్తులకు శిక్షలు పడవనీ, వారు దర్జాగా తప్పించుకు తిరుగుతుంటారనీ అనుకుంటుంటాం. అలాంటి స్థితిలో తప్పు చేసినవాడికి అప్పటికప్పుడు సరైన శిక్ష పడేలా చేయాలనుకునే ఓ పోలీసాఫీసర్ కథ ఈ సినిమా అని తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చిత్రపరిశ్రమకి మేం వ్యతిరేకం కాదు. సినిమా వ్యాపారులేకాదు, ఇతర రంగాల వారెవరైనా మా భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాత్రం సహించం, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ, అక్కడా పెరగాలని కోరుకుంటున్నామన్నారు.