Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గుండు కొట్టిస్తామన్నవారు క్షమాపణ చెప్పారు: జగపతి బాబు
జగపతి బాబు కీలకపాత్రలో చేసిన 'జై భోలో తెలంగాణా' చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే విడుదల సమయంలో ఈ చిత్రంలో నటించినందకు జగపతిబాబుకి గుండు కొట్టిస్తామంటూ ప్రకటనలు చేసారు. దీనిపై చిత్రం విడుదలైన తర్వాత జగపతిబాబు స్పందించారు. ఆయన మాటల్లోనే...దర్శకుడు శంకర్ వచ్చి 'జై భోలో తెలంగాణా' లో నటించమని అడిగినప్పుడు మొదట్లో ఆలోచించాను. కానీ కళాకారునిగా అన్ని అన్ని తారగా పాత్రలు చేయాలనే ఉద్దేశంతో అందులో నటించాను.
ఇందులో నా నోటి నుంచి ఏ ప్రాంతాన్ని కించపరచే విధంగా సంభాషణలు లేకుండా జాగ్రత్త పడ్డాను. ఆ సినిమాలో నేను చేసినందుకు తిరుపతిలోనాకు గుండు కొట్టిస్తానని అన్నారు. సినిమా విడుదల తర్వాత వారు నన్ను కలిసి క్షమాపణలు చెప్పారు అన్నారు.ప్రస్తుతం జగపతిబాబు...చట్టం, నగరం నిద్ర పోతున్న వేళ, క్షేత్రం, కీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన తన పుట్టినరోజుని శనివారం జరుపుకున్నారు.