Don't Miss!
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
గుండమ్మ కథ విజయ ఢంకా మోగించిన చోటే, నా 11వ సినిమా ఇదే.. బాలయ్య ఎమోషనల్!
ఈ సంక్రాంతికి విడుదలైన బాలయ్య జై సింహ చిత్రం మంచి విజయం సాధించింది. తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం నందమూరి అభిమానులని మెప్పించింది. కాగా ఆదివారం ఈ చిత్రం దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో జై సింహా చిత్ర యూనిట్ గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో శతదినోత్సవ వేడుకని జరుపుకోవడం విశేషం. ఈ వేడుకకు బాలయ్య, దర్శకుడు కె ఎస్ రవికుమార్, నిర్మాత సి కళ్యాణ్ తో పాటు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ గురించి అద్భుతంగా ప్రసంగించడం విశేషం.
బాలయ్య కెరీర్ లో 11వ చిత్రం
బాలయ్య మాట్లాడుతూ.. శతదినోత్సవం జరుపుకుకుంటున్న తన 11 వ చిత్రం జైసింహా అని తెలిపారు. జై సింహా చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడానికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు తన తండ్రే స్ఫూర్తి అని బాలయ్య అన్నారు. తండ్రిని అనుకరించే వాడు వారసుడు కాదని, ఆయనలా జీవించేవాడే నిజమైన వారసుడు అని తండ్రి ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని అన్నారు.
Recommended Video
నిర్మాత, దర్శకుడి గురించి
ఈ కాలంలో అభిరుచి గల నిర్మాతలు తగ్గిపోయారని అన్నారు. అభిరుచి కలిగిన కొద్దిమంది నిర్మాతల్లో సి కళ్యాణ్ ఒకరని బాలయ్య అన్నారు. తన అభిమానులు ఎలాంటి సినిమాలు ఆశిస్తారో తెలిసిన రచయిత రత్నం అని బాలయ్య అన్నారు. దర్శకుడు కె ఎస్ రవికుమార్ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారని తెలిపారు.
ఇక్కడే ఎందుకు
జై సింహా చిత్ర శత దినోత్సవ వేడుక ఇక్కడే జరుపుకోవాలనిపించిందని బాలయ్య అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. తన తండ్రి నటించిన గుండమ్మ కథ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి చిత్రాల సత్తా దినోత్సవ వేడుకలు ఇక్కడే జరిగాయని అన్నారు. అందువలనే ఈ చిత్ర 100 రోజుల వేడుక ఇక్కడే నిర్వహించామని బాలయ్య అన్నారు.
హీరోయిన్ల గురించి
ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నయనతార, హరిప్రియ, నటాషాకు బాలయ్య ధన్యవాదాలు తెలిపాడు. అమ్మ కుట్టి సాంగ్ కు జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారని బాలయ్య ప్రశంసించారు.
ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించడానికి కారణం
ఎన్టీఆర్ కొడుకుగా ఆయన పాత్రలో నటిస్తుండడం తన అదృష్టం అని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ చరిత్ర తెలుగుతెలుగు వారందరికీ మధుర జ్ఞాపకం. ఆ జ్ఞాపకం మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే తాను ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రారంభించానని అన్నారు.
పదేళ్ల తరువాత
చిత్ర
దర్శకుడు
కె
ఎస్
రవికుమార్
మాట్లాడుతూ
తాను
పదేళ్ల
తరువాత
సత్తా
దినోత్సవ
వేడుక
చూస్తున్నా
అని
ఆ
అవకాశం
కల్పించిన
అభిమానులకు
కృతజ్ఞతలు
అని
రవికుమార్
అన్నారు.
100
రోజుల
వేడుకలు
కనుమరుగై
పోయాయని
అంటున్న
సమయంలో
ఇంకా
ఉంది
అని
నిరూపించారని
అన్నారు.
బాలయ్యతో
మళ్ళీ
మళ్ళీ
సినిమా
చేయాలని
ఉందని
అన్నారు.