యే మేరా జహా, నారాజు గాకురా ఓరన్నయో... అంటున్న పవన్ కళ్యాణ్!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో' మ్యూజిక్ ఆల్బమ్ లో మరో రెండు పాటులు రిలీజ్ అయ్యాయి.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'దేశ్ బచావో' మ్యూజిక్ ఆల్బమ్ లో మరో రెండు పాటులు రిలీజ్ అయ్యాయి. ఉదయమ ట్రావెలింగ్ సోల్జర్ అంటూ ఓ పాట విడుదల చేయగా... తర్వాత యే మేరా జహా, నారాజు గాకురా ఓ రన్నయో అంటూ మరో రెండు పాటలు రిలీజ్ చేసారు.

జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాటలు రిలీజ్ చేసారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, ఖుషి, జానీ చిత్రాల్లోని పాటల రీమేక్స్ కావడం విశేషం. అప్పట్లో అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈపాటలనే లిరిక్స్ మార్చి జనాల్లో చైతన్యం నింపే సాహిత్యంతో రీమిక్స్ చేసారు.
ఈ పాటలు ఇది యువతలో భావోద్వేగాలను నింపుతుందని, యువతకు స్పూర్తి కలిగేలా చేస్తుందని పవన్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు. వైజాగ్ ఆర్కే బీజ్ లో జరిగే ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం జరిగే ఉద్యమంలో ఈ పాటలే మారుమ్రోగబోతున్నాయి.


Click it and Unblock the Notifications











