Just In
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 1 hr ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 11 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 12 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
Don't Miss!
- News
నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్కు లేఖ
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎన్టీఆర్ పై చెన్నై లో ఉప్పొంగిన అభిమానం : మూడు కిలో మీటర్ల మేర స్తంబించిన ట్రాఫిక్
తమిళ నాడు రాజధాని చెన్నై మరో సారి పోటెత్తింది. అయితే ఈసారి వరద తుఫాన్ ది కాదు అభిమానానిది. జనతాగ్యారేజ్ షూటింగ్ కోసం చెన్నై లో ఉన్న యంగ్ టైగర్ ని చూడటానికి...ఒక్క నిమిషమైనా మాట్లాడటానికీ బారులు తీరారు ఆయన అభిమానులు .
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులంతా పొలోమంటూ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. చాంతాడంత క్యూలు కట్టి బారులు తీరారు.దీనితో అసలే ఇరుకుగా ఉండే చ్ఝెన్నై రోడ్లు మరింత గా ట్రాఫిక్ తో కిక్కిరిసి పోయాయి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా చెన్నైలో జరుగుతోంది కదా. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ కి దర్శకుడు కొరటాల శివ. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులంతా పొలోమంటూ స్టూడియో దగ్గరకు చేరి ఆయనని చూదటానికి ఎగబడ్దారు. షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చిన తారక్ అందరితోనూ సన్నిహితంగ మెలుగుతూన్ ఆప్యాయంగా పలకరించాడట. ఈ సన్ని వేశాన్ని ఫొటో తీసిన నటుడు బ్రహ్మాజి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి "చెన్నైలో ట్రాఫిక్ జామ్.. తారకరాముడి దర్శనం కోసం" అంటూ ఒక కామెంట్ ఆడ్ చేసాడు.
తమిళనాడు లో ఉన్న తెలుగు వారందరికీ పెద్ద ఎంటీఆర్ అంటెర విపరీతమైన అభిమానం ఉంది. ఇప్పుడు ఆయన మనవడి మీద తమ ప్రేమని చూపించిన వారు కొందరైతే, స్వతహాగా తనకు ఉన్న ఫాలోయింగ్ వల్ల కూడా ఏర్పడ్డ తమిళ అభిమానులూ తారక్ ని కలిసేందుకు వచ్చారట ...