Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
RC15: తెలుగు వాళ్లపైనే శంకర్ ఫోకస్.. రామ్ చరణ్ కోసం టాప్ డ్యాన్స్ మాస్టర్
ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ ఏ సినిమా చేసినా కూడా అందులో సాంగ్స్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వీలైనంత వరకు అత్యదిక బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తారు. మ్యూజిక్ దర్శకుల నుంచి ఏ విధంగా అయితే మంచి సాంగ్స్ రాబట్టుకుంటారో అలాగే డ్యాన్స్ మాస్టర్స్ నుంచి కూడా అదే తరహా టాలెంట్ ను రాబడతారు. ప్రస్తుత అందరి చూపు కూడా రామ్ చరణ్ 15వ సినిమాపైనే ఉంది. ఆ సినిమాలో పాటలు ఎలా ఉంటాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండియన్ 2 విషయంలో కాస్త అప్సెట్ అయిన శంకర్ ఎలాగైనా మరో బాక్సాఫీస్ హిట్ అందుకోని మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసి ఈ హీరోతో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా దిల్ రాజు కలయికలో ప్రాజెక్ట్ సెట్టవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచారు. అయితే పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ ఆయన ఎక్కువగా తెనుగు టెక్నీషియన్లను తీసుకుంటున్నారు. ఇప్పటికే డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.
థమన్ మ్యూజిక్ అందిస్తాడాని అంటున్నారు గాని ఇంకా ఫైనల్ కాలేదు. ఇక డ్యాన్స్ మాస్టర్ గా జానీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శంకర్ ను కలిసిన జానీ మాస్టర్ సోషల్ మీడియాలో అధికారికంగా ఆ విషయాన్ని తెలియజేశారు. అప్పట్లో శంకర్ బాయ్స్ సినిమాలో 500 మంది డ్యాన్సర్స్ తో ఒక సాంగ్ కంపోజ్ చేయగా జానీ మాస్టర్ కూడా అందులో ఎక్కడో ఉన్నాడట. అలాగే ముక్కలా ముక్కబులా పాటను ఎన్నోసార్లు స్టేజ్ ల మీద చేశాను అంటూఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. ఇక శంకర్ తో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. సినిమాను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలని శంకర్ - దిల్ రాజు ప్రణాళికలు రచిస్తున్నారు.