Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జయప్రద సినీ వారసుడుగా సిద్ధార్థ తెరంగ్రేటం
ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్రరప్రదేశ్లోని రాంపూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
త్వరలోనే తన సినీ వారసుడుగా తన సోదరి కుమారుడైన సిద్ధార్థను హీరోగా పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అతను నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, త్వరలోనే అతడి తెరంగ్రేటానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. తెలుగు నేలపై పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని, తెలుగు ప్రేక్షకులు వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని వెల్లడించింది.
ఎన్టీఆర్, ఆయన కుటుంబం అంటే ఎంతో అభిమానం అని చెప్పున జయప్రద....బాలయ్యకు ఏవిషయంలో అయినా తన సపోర్టు ఉంటుందని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అయితే తాను ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేనందున రాజకీయాల గురించి మాట్లాడటానికి నిరాకరించారు.
ఏప్రిల్ 3, 1962లో రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. ఆమె తండ్రి కృష్ణారావు తెలుగు ఫిల్మ్ ఫైనాన్సర్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ఆమె స్కూల్ లో ఇచ్చిన డాన్స్ షోను చూసిన ఓ దర్శకుడు ఆమెకు తన 'భూమి కోసం' సినిమాలో 3 నిమిషాలు డాన్స్ చేసే అవకాశం ఇప్పించాడు. అప్పుడు ఆమె కేవలం రూ. 10 పారితోషికం తీసుకుంది. అలా మొదలైన ఆమె సినీ జీవితం...బాలచందర్ 'అంతులేని కథ', కె. విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారి ఇటు దక్షిణాదితో పాటు, అటు బాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలిగారు.