Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవి నియంత..నమ్మొద్దు
రాజకీయ లబ్ధికోసమే చిరంజీవి మదర్ థెరిస్సా, జ్యోతిరావుపూలే, అంబేద్కర్ ఫొటోలు పెట్టుకుని సామాజిక న్యాయం అంటున్నారని నిజానికి చిరంజీవికి సామాజిక న్యాయం తెలియదని విమర్శించారు. బ్లడ్ బ్యాంకుతో పక్కా వ్యాపారం జరుగుతోందని, అన్నికోట్లు సంపాదించినా ఏనాడూ పేదవాడికి సాయం చేయని చిరంజీవి ఇప్పుడు ప్రజలకు ఎంతో చేస్తానని చెబుతున్నాడు. ముప్ఫై ఏళ్ళుగా ఆయన సినీ జీవితంలో సామాజిక న్యాయం కళ్ళకు కనబడలేదా, చెవులకు వినపడలేదా అని ప్రశ్నించారు. దయచేసి చిరంజీవి మాటలు నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు.
చిరంజీవి తన మనుషులను పెట్టి తరిమితరిమి కొట్టించిన సందర్భంలో అభిమానులే తనకు అండగా నిలిచారని, అభిమానుల అండ ఉన్నంతకాలం తాను ఎవరికీ భయపడను అని అన్నారు. పేదలకు అండగానిలిచే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. అనంతరం జీవిత మాట్లాడుతూ, మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. తనకు విజయవాడ అంటే ఎంతో ఇష్టమని, చిన్నతనంలో ఎక్కువగా సంక్రాంతికి సత్యనారాయణపురం వచ్చేవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఎంపీ లగడపాటి రాజగోపాల్, మల్లాది విష్ణు, వంగవీటి శంతన్కుమార్, కునుకు రాజశేఖర్, సామంతపూడి నరసరాజు, వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు.