Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ప్లాప్ ఎఫెక్ట్: నాని ‘జెండాపై కపిరాజు’లో మార్పులు
హైదరాబాద్: నాని ద్విపాత్రాభినయం చేస్తూ అమలపాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'జెండాపై కపిరాజు'. ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ వెర్షన్(జయం రవి హీరో) ఇటీవల అక్కడ విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు వెర్షన్లో పలు మార్పులు, చేర్పులు చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో నెల రోజులపైనే పడుతుందని అంటున్నారు. అంటే ఏప్రిల్ నెలాఖరున ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో నాని పాత్ర విషయానికొస్తే....తండ్రిగానూ, కొడుకు గానూ నాని కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామ్ నిర్మాతలు.
ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్కుమార్ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్, శివబాలాజీ, వెన్నెల కిషోర్, ధన్రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్, కూర్పు: ఫాజల్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్కుమార్.