Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ పై ఈ వార్త నిజమేనా?...నమ్మబుద్ది కావటం లేదు
చెన్నై: జాతకాలు చెప్పే హీరో కథలు మనకు కామెడీ సినిమాల్లోనే కనపడుతూంటాయి. అయితే ప్రభాస్ వంటి స్టార్ డమ్ హీరో సినిమాలో కనపడుతుందా...అంటే అవుననే కనపడుతోంది. ప్రభాస్ కొత్తగా కమిటైన చిత్రంలో చెయ్యిచూసి జాతకాలు చెప్తూండాడట. అదీ నిజమౌతుందిట...ఇదీ ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రమే కాదు మీడియా సర్కిల్స్ లోనూ వినపడుతున్న టాక్.
ఇంతకీ ఏ సినిమా కోసం ఈ క్యారక్టరైజేషన్, ఎవరా డైరక్టర్ అంటారా...ఆ దర్శకుడు మరెవరో కాదు ..గోపిచంద్ తో జిల్ చిత్రం డైరక్ట్ చేసిన రాధాకృష్ణ.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుపుకోనుందట. ప్రభాస్ హోం ప్రొడక్షన్స్ యువి క్రియేషన్స్, గోపీకృష్ణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారనే వార్త తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ చెప్పిన కథకూ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ చిత్రానికి చెందిన మరిన్ని విశేషాలు క్రింద స్లైడ్ షోలో

వెరైటీ లవ్ స్టోరీ
సరికొత్త కాన్సెప్ట్ లవ్ స్టోరీతో తెరకెక్కుతుందని, ఇలాంటి కథతో తెలుగులో ఏ హీరో ఇప్పటివరకూ సినిమా చెయ్యలేదంటున్నారు

సింగిల్ సిట్టింగ్ లో
ఈ కథను విన్న ప్రభాస్ ...సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్టు మార్పులు కూడా చెయ్యనవసరం లేదని, గోఎ హెడ్ అన్నట్లు సమాచారం.

తొలి చిత్రం సైతం
దర్సకుడు రాధాకృష్ణ తొలి చిత్రం జిల్ ని సైతం ఇదే నిర్మాతలు నిర్మించారు. దర్శకుడుపై నమ్మకంతో మరో అవకాసం ఇస్తున్నారు.

లొకేషన్స్ ఫిక్స్
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లోకేషన్లు కూడా ఇప్పటికే నిర్మాతలు ఫిక్స్ చేసేశారు.

సూర్యకు చెప్పారు కానీ
తమిళ హీరో సూర్యకు ఈ కథను చెప్పారు కానీ, ఆయన డేట్స్ ప్లాబ్లమ్ తో ముందుకు వెళ్లలేదని సమాచారం.

హీరోయిన్ కోసం
ఇక ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం సెర్చింగ్ జరుగుతోందని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు.

కొత్తవాళ్లైతే బెస్ట్
అయితే ఈ సినిమాలో నూతన తారను పరిచయం చేయటానికి ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు.

ఆడిషన్స్ జరుగుతున్నాయి
హీరోయిన్ ఎంపికకు సంబంధించి ఆడిషన్ కార్యాక్రమం జరుగుతోందని తెలిపారు.

ఫైనల్ చేసేస్తాం
మరికొద్దిరోజుల్లో హీరోయిన్ ఎంపిక ఫైనలైజ్ అవుతుందన్నారు.

ప్రభాస్ చెయ్యి చూసి జాతకాలు చెప్తాడా? అవి నిజమవుతాయా?
కథ గురించి చెప్పలేదుకాగా కథ గురించి మాత్రం దర్శకుడు రాధాకృష్ణ పెదవి విప్పలేదు.

జాతకాలు
అయితే ఈ చిత్రంలోవచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. రాధాకృష్ణ మాట్లాడుతూ -''ప్రేమకథా చిత్రమిది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తాం. ప్రభాస్ పక్కన హీరోయిన్గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయి. హీరో చేయి చూసి జాతకాలు చెప్పేస్తుంటాడట. అలా చెప్పే విషయాలు అన్ని నిజం అవుతుంటాయని తెలుస్తోంది.

ఎలాంటి మలుపులు
అలా జాతకాలు చెప్పే విద్య వల్ల హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ అట.

ఇమ్మీడియన్ ఫిల్మ్
కాగా బాహుబలి-2 తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాతే
సుజిత్ చిత్రం తర్వాతే రాధాకృష్ణ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

అప్పటినుంచీ..
'మిర్చి'లో ప్రభాస్ ని చూసి అప్పుడే మూడేళ్లు దాటేసింది. అప్పట్నుంచి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'బాహుబలి'కి అంకితమయ్యారు.

గ్యాప్ లేకుండా...
బాహుబలి అయిన వెంటనే... ప్రభాస్ నుంచి సినిమాలు ఆశిస్తున్న ప్రేక్షకులు, అభిమానుల కోసం వెంట వెంటనే రెండు సినిమాల్లో నటించనున్నారు.

జనవరి నుంచి..
వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట.

రాధాకృష్ణ మాట్లాడుతూ ...
''ప్రేమకథా చిత్రమిది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తాం. ప్రభాస్ పక్కన హీరోయిన్గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

భారీ బడ్జెట్ తోనే
రాధాకృష్ణతో చేయబోయే ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మోస్ట్ స్టైలిష్ గా
రాధాకృష్ణ తొలి చిత్రం జిల్ లో చాలా స్టైలిష్ గా గోపీచంద్ ని చూపారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ ని అంతకన్నా మోస్ట్ స్టైలిష్ గా చూపించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.