Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, క్రిష్ (ఫోటోస్)
Recommended Video
మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు 95వ జయంతి పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్ అభిమానుల తాకిడితో సందడిగా మారింది. అభిమానులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘాట్ను సందర్శించి ఎన్టీ రామారావును స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ తన ఇద్దరు కొడుకులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కలిసి ఘాట్ను సందర్శించారు.
రాష్ట్రానికి ఈ రోజు పండగ రోజు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ రోజు అన్నగారి 95వ పుట్టినరోజు, ఆంధ్రరాష్ట్రానికి ఒక పండగ రోజు. ప్రతి ఇంట ఒక బిడ్డకావాలి, ఆ బిడ్డ ఒక రామారావు లాగా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఆయనంతటి మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకునే పర్వదినం నేడు. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే తరాలు చాలవు, యుగాలు చాలవు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బావుండాలి, ఇరు ప్రాంతాల వారు బావుండాలి, సుఖంతా బ్రతకాలి, పేద బడుగు బలహీన వర్గాల వారు బావుండాలని కోరుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్'' అన్నారు.
పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ చరిత్రను చేర్చాలి
మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరి జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో ఉన్నాయి. అలాగే తెలుగు జాతికై పోరాడిన నందమూరి తారకరామరావు జీవితంలో ముఖ్య ఘట్టాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.... అని హరికృష్ణ వెల్లడించారు.
భారీ సంఖ్యలో అభిమానులు
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ
ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన దాదాపు అందరూ ఘాట్ను సందర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
నాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా: దర్శకుడు క్రిష్
ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్, రచయిత సాయి మాధవ్ బుర్రా ఘాట్ను సందర్శించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప జేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, అందరికీ అన్న నందమూరి తారకర రామారావు సినిమాలు చూస్తూ పెరిగిన నేను, ఆయన జీవిత చరిత్రను చలన చిత్ర రూపంలో జాతి మొత్తానికి అందించే సదవకాశాన్ని, మహా భాగ్యాన్ని నాకు కలగజేసిన నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నగారి జయంతి రోజున ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను. హ్యూమన్ ఫినామినా చాలా తక్కువ మంది వ్యక్తుల్లో చూస్తాం. అలాంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను' అన్నారు.