Don't Miss!
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ కి బాలకృష్ణ సూచనలు
జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఎన్టీఆర్ ఘాట్వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణ, బాలకృష్ణ, మోహనకృష్ణ తదితరులంతా హాజరవుతారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో తాత పుట్టిన ఊరు నిమ్మకూరు వెళ్తారు.
అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అక్కణ్నుంచి శ్రీకాకుళం వెళ్లి రోడ్ షోలకు శ్రీకారం చుడతారు. రోడ్ షోల్లో ఆకట్టుకునే రీతిలో ప్రసంగించేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మొత్తం నెలరోజుల పాటు అవిశ్రాంతంగా జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షో జరగనుంది. ఈ సందర్భాగా నందమూరి నటవారసులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలవనున్నారు. ఇలా జరగడం ఇదే ప్రథమనని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పర్యటనపై పార్టీ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.