twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరక్టర్ కి సెకండ్ టైమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జూ ఎన్టీఆర్...!?

    By Sindhu
    |

    ప్రస్తుతం తమిళంలో, తెలుగులో బిజీగా వున్న తమన్నా తెలుగు లో గీతా ఆర్ట్స్ నిర్మించే రెండు చిత్రాల్లో నటిస్తుంది. అందులో ఒకటి అల్లు అర్జున్ సరసన నటించే బద్రీనాథ్ కాగా, మరొకటి నాగార్జున, సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం.

    కాగా ఈ చిత్రాల తర్వాత తమన్నా జూ ఎన్టీఆర్ తో జతకట్టనుందని సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో అశోక్ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఛత్రపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర" బ్యానర్ లో నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన 'అశోక్" చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా, రీసెంట్ గా రవితేజ తో 'కిక్" సినిమాతో చాలా పాపులర్ అయిపోయారు. తర్వత జూ ఎన్టీఆర్ తో చేయడానికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, కథ సిద్దంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్ చిత్రంగా 'శక్తి"లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదలవుతుందని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X