Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘కుమారి 21ఎఫ్’: స్పెషల్ షో చూసి ఎన్టీఆర్ ట్వీట్
హైదరాబాద్: విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్ప్లే కూడా అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా తీస్తున్న సుకుమార్... ఎన్టీఆర్ కోసం ‘కుమారి 21ఎఫ్' స్పెషల్ షో వేసారు. సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఇదొక న్యూ లవ్ స్టోరీ. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతాప్, దేవి, రాండీ ఎక్సలెంట్. హెబ్బ, రాజ్ చాలా బాగా నటించారు. సుకుమార్ గారు హార్ట్ టచింగ్ స్టోరీ అందించారు. హాట్సాఫ్ ఫర్ ది బ్రేవ్ అండ్ బోల్డ్ రైటింగ సర్' అంటూ ట్వీట్ చేసారు.
A
new
age
luv
story..KUMARI
21F.throughly
loved
it!!!Pratap
Devi
and
Randy
excelled
to
the
highest.heebah
and
raj
were
at
their
best.
—
tarakaram
n
(@tarak9999)
November
19,
2015
Last
but
not
the
least
a
very
heart
touching
story
from
the
master
himself
SUKKU
Garu..hats
off
for
the
brave
and
bold
writing
sir.
—
tarakaram
n
(@tarak9999)
November
19,
2015
రాజ్తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న(నేడు) విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.