Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్తో కలిసి ఆ సినిమా చేస్తా: నాగ చైతన్య
తాజాగా చైతూకి గుండమ్మ కథ రీమేక్ ప్రశ్న ఎదురైంది. ‘గుండమ్మ కథ’ చేస్తున్నారా? లేదా? అని చైతన్యను ఓ అభిమాని ప్రశ్నించారు. దానికి చైతూ ఇలా సమాధానం చెప్పాడు.
గుండమ్మ కథ.. తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా సావిత్రి, జమున హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ సినిమా ఇది. అయితే ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని పలువురు సినీ ప్రముఖులు చెప్పడం అప్పుడప్పుడూ వింటూనే ఉన్నాం. ఆమధ్య మంచు మోహన్ బాబు కూడా అలనాటి 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ తర్వాత పెద్దగా ఇంట్రస్త్ చూపలేదు.
బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా
ఈ గుండమ్మ కథ రీమేక్ ఇప్పటి ఆలోచన కాదు బాలయ్యా, నాగార్జునలు యంగ్ హీరోలుగా ఉన్న కాలం నుంచీ ఈ క్లాసిక్ రీమేక్ అలా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమాను మళ్లీ ఆ ఇద్దరు వారసులతో రీమేక్ చేయాలని చాలాకాలంగా వార్తలు వచ్చేవి. అంటే బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా అన్నమాట.
ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా
కానీ అదిజరగలేదు. ఇక ఆ తర్వాత వారి థర్డ్ జనరేషన్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. గుండమ్మ కథే కాదు.. మిస్సమ్మలో కూడా ఈ ఇద్దరూ కనిపించబోతున్నారని సమాచారం. అయితే పూర్తిగా రీమేక్ కాదు కానీ.. ఓ సినిమా కోసం ఈ ఇద్దరూ గుండమ్మ కథలోని తమ తాతల పాత్రలను చేస్తారని కూడా అనుకున్నారు గానీ. ఈ వార్తలన్నీ వాళ్ళూ వీళ్ళూ అనుకున్నవే అధికారికంగా ఎవ్వరూ చెప్పలేదు.
నాగ చైతన్య బద్దలు కొట్టాడు
అయితే ఈ అయోమయాన్ని అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య బద్దలు కొట్టాడు. తాను జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడంపై స్పందించాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు కలిసి నటించిన ‘గుండమ్మ కథ'ను నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చైతూకి ఈ ప్రశ్న ఎదురైంది. ‘గుండమ్మ కథ' చేస్తున్నారా? లేదా? అని చైతన్యను ఓ అభిమాని ప్రశ్నించారు. దానికి చైతూ ఇలా సమాధానం చెప్పాడు.
Recommended Video
చాలా జాగ్రత్తగా తీయాలి
‘‘అంత గొప్ప సినిమాను తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ సినిమా కచ్చితంగా చేయాలనే కోరిక అయితే నాకుంది. కాకపోతే ఇప్పుడు కాదు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక. తాతగారిలా కాకపోయినా నటనలో ఇంకొంచెం మెరుగయ్యాక చేస్తా. ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టు కాకుండా.. ప్రస్తుత కాలానికి.. అంటే ఇప్పుడున్న సినిమా ప్రేక్షకులకు నచ్చేలా తీయాలనుంది. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆ సినిమాను తప్పకుండా చేస్తా.'' అని చెప్పాడు.