కె. విశ్వనాథ్కు 'అల్లూరి' పురస్కారం

అక్టోబర్ 1న అల్లురామలింగయ్య జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం హరిహరకళాభవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సారిపల్లి కొండలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్కు జ్ఞాపికతోపాటు స్వర్ణకంకణంతో సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకకు ప్రముఖ గాయని పి. సుశీల ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంకా ప్రముఖ సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











