Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ప్రపంచవ్యాప్తంగా కాలా ఫీవర్.. సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీ
Recommended Video
రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలూ.. ఫ్యాన్స్ ఫీవర్ పట్టుకోవడం చాలా సహజం. అడ్వాన్స్ బుకింగ్ ఎగబడటం, రిలీజ్ రోజున తలైవాపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు హంగామా చేస్తుంటారు. ఆ రోజును పండుగల భావించే ఫ్యాన్స్ పనులన్నీ పక్కన పెట్టేసి ఆనందంలో మునిగిపోతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆరాట పడుతుంటారు. అందుకే కాలా చిత్రం రిలీజ్ నేపథ్యంలో కేరళలో ఓ ఐటీ కంపెనీ ఏకంగా జూన్ 7వ తేదీని హాలీడేగా ప్రకటించడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది.
7న ఐటీ కంపెనీ హాలీడే
గతంలో కబాలి చిత్ర రిలీజ్ సందర్భంగా కూడా చాలా సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. ఉద్యోగుల సంతోషమే వారి ఆనందంగా భావించడమే కాకుండా జోష్ పెంచే ప్రయత్నం చేశాయి. తాజాగా కేరళలోని టెలియస్ టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ కాలా రిలీజ్ రోజున సెలవు ప్రకటించింది.
రజనీకాంత్ మాయలో ఉద్యోగులు
ఉద్యోగులందరూ రజనీ మానియాలో ఉన్నారు. వారి సంతోషాన్ని అడ్డుకోవడం అంతగా మంచిది కాదు. వారిని ఆపితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఓ రోజును సెలవుగా ప్రకటించామని సదరు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
కంపెనీ అధికారిక ప్రకటన
సూపర్ స్టార్ రజనీకాంత్పై ఉన్న విశేష అభిమానానికి గౌరవంగా, అలాగే ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు సంస్థ జూన్ 7వ తేదీన సెలవు దినంగా పాటిస్తున్నది అని సదరు కంపెనీ అధికారిక లెటర్ హెడ్పై ఓ నోటీసును జారీ చేసింది. టెలియస్ టెక్నాలజీ కంపెనీ జారీ చేసిన లెటర్ హెడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
సెలవు మాట నిజమే
మా కంపెనీ కాలా రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించిన విషయం వాస్తవమే. రజనీకాంత్ లాంటి వ్యక్తి ఉండటం దేశానికి గర్వకారణంగా భావిస్తాం. ఇది మా కంపెనీ పబ్లిసిటీ కోసం చేయడం లేదు అని టెలియస్ కంపెనీ ఉద్యోగి ఒకరు మీడియాకు వెల్లడించారు.
|
ముంబై ధారవి మురికివాడ నేపథ్యంగా
కబాలి తర్వాత వరుసగా రజనీతో జతకట్టిన పా రంజిత్ కాలా చిత్రానికి దర్శకుడు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబై ధారవి కథా నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నానా పాటేకర్, ఈశ్వరీరావు, హ్యుమా ఖురేషి, సముద్ర ఖని తదితరులు నటించారు.