Don't Miss!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోలపై విమర్శలు, బాహుబలిపై కూడా...
హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన విజువల్ వండర్ గా చెప్పబడుతున్న 'బాహుబలి'పై కొందరు సీనియర్ యాక్టర్లు విమర్శలు చేసిన ఘటనలు గతంలో చూసాం. తాజాగా మరో సీనియర్ నటుడు, తెలుగు గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ కూడా బాహుబలిపై విమర్శలు చేసారు.
జులై 25న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో ఆయన బాహుబలి గురించి స్పందిస్తూ... 'అసలు బాహుబలి సినిమాలో ఏముందండీ? ఏదైనా మంచి డైలాగ్ ఉందా? ఆహ్లాదకరమైన సంగీతం ఉందా? కథ ఏమైనా ఉందా? ఇటువంటి యుద్ధ సన్నివేశాలన్నీ అప్పట్లో విఠలాచార్యగారు తీసారు. ఆ రోజుల్లో ఫైట్స్ ని ట్రిక్స్ అనేవారు. ఇపుడేమో గ్రాఫిక్స్ అని పేరు పెట్టి కోట్లు ఖర్చు పెడుతున్నారు' అని విమర్శించారు.
'కోట్లు మంది చూసే సినిమా సొసైటీకి ఉపయోగపడాలి. అఫ్ కోర్స్ సినిమా ఈజ్ బిగ్ ఎంటర్టెన్మెంట్. కాదనడం లేదు. కోట్లు ఖర్చు పెడుతున్నపుడు ఎంటర్టెన్మెంటుతో ఇస్తూనే సొసైటీకి, ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు తీయాలి. కేవలం ఎంటర్టెన్మెంటు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు' అని కైకాల చెప్పుకొచ్చారు.
ఇప్పటి హీరోలు, నటులపైనా కైకాల విమర్శలు చేసారు. అప్పట్లో మేం డబ్బు కోసం పాకులాడేవాళ్లం కాదు. ఎంత సేపూ మంచి పాత్ర చేయాలి. పేరు రావాలి. జనాల హృదయాల్లో స్థానం సంపాదించాలి అని కృషి చేసే వాళ్లం. ఇప్పుడేంటంటే డబ్బే ప్రధానం అయిపోయింది అందరికీ. నటన పరంగా కష్టపడే తత్వం పోయింది....(మిగతా వివరాలు స్లైడ్ షోలో)
అన్ని కోట్లు ఇవ్వడం దేనికి
రెండు
పిక్చర్లు
చేశారంటే
రెండు
కోట్లు,
మూడు,
నాలుగు,
పది
కోట్లు
ఇలా
పెరిగిపోతోంది.
ఇన్నేసి
కోట్లు
ఇవ్వడం
ఏమిటో
అర్థం
కావడం
లేదు
అంటూ
కైకాల
విస్మయం
వ్యక్తం
చేసారు.
సీనియర్లు
మా
కాలంలో
మేం
సీనియర్లకు
తగిన
గౌరవం
ఇచ్చేవాళ్ళం.
కాంతారావుగారు,
మిక్కిలినేనిగారి
తర్వాతే
నేను
ఇండస్ట్రీకి
వచ్చాను.
అయితే
వారికంటే
నాకే
సినిమాలు
ఉండేవి.
అయినా
వారు
సెట్స్
కు
వస్తే
లేచి
నిలబడి
గౌరవం
ఇచ్చేవాళ్లం
అన్నారు.
ఇప్పటి తరం
ఇప్పటి
తరం
వారికి
సీరియర్లంటే
గౌరవం
లేదు.
చూస్తే
నమస్కారం
పెట్టాల్సి
వస్తుందని
హడావుడిగా
వెళ్లిపోతారు.
మనంతట
మనమే
విష్
చేస్తే
చూసి
చూడనట్లు
వెళ్లిపోయారు
అంటూ
కైకాల
వ్యాఖ్యానించారు.
గౌరవించడం లేదు
రామారావు
గారు,
ఏఎన్ఆర్
గారి
లాంటి
సీనియర్లు
వెళ్లిపోయారు.
ఉన్న
వాళ్లలో
నేను
సీనియర్
మోస్ట్
ని.
నాకేం
గౌరవం
ఇస్తున్నారు
చెప్పండి.
ఓ
సినిమా
ప్రివ్యూకి
పిలుస్తున్నారా?
ఓ
ఫంక్షన్
కి
పిలుస్తున్నారా?
అవార్డు
ఫంక్షన్
కి
ఏమైనా
పిలుస్తున్నారా?
ఎప్పుడైనా
టీవీలో
ఆ
ఫ్రోగ్రామ్
చూసి
అరె
ఇదెప్పుడు
జరిగింది..కనీసం
మనల్ని
పిలవను
కూడా
పిలవలేదే
అని
అనుకోవడం
తప్ప
చేసేది
ఏమీ
లేదు
అని
కైకాల
వ్యాఖ్యానించారు.