Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా సినిమాలు నేనే ఎందుకు నిర్మించుకుంటున్నానంటే...కళ్యాణ్ రామ్
"కత్తి" చిత్రంతో మరో సారి చతికిలబడ్డ కళ్యాణ్ రామ్ రీసెంట్ గా టీవీ నైన్ ఛానెల్ తో మాట్లాడుతూ..తను ఎందుకు నిర్మాతగా మారాడో వివరించాడు. అతను మాటల్లోనే...నేను నా సొంత బ్యానర్ పై నా సొంత డబ్బుతో సినిమాలు నిర్మిస్తున్నాను. లాస్ వస్తే నేనే భరిస్తున్నాను. మరో నిర్మాత నా వల్ల లాస్ కాకూడదని నా ఆలోచన. అలాగే జనం నన్ను చూసి నవ్వుకోవటం ఇష్టం ఉండదు. వేరే నిర్మాత నాతో చిత్రం నిర్మించి నష్టపోతే జనం నన్ను చూసి ఓ నిర్మాతను నష్టపరిచానని నవ్వుకోవచ్చు. అందుకే నా సొంత బ్యానర్ పై సొంత రిస్కుతో సినిమా చేస్తున్నాను అన్నారు. కళ్యాణ్ రామ్ గత చిత్రాలు అతనొక్కడే, హరేరామ్, జయీభవ కూడా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై చేసినవే.
ఇక కత్తి చిత్రం గురించి చెబుతూ....రచయిత వక్కంతం వంశీ కథ చెప్పినప్పుడు..ఈ చిత్రంలో వైవిధ్యమైన పాయింట్ ఏముంది అనే సందేహం అతడిముందు వ్యక్తం చేశాను. అయితే అతను చెప్పిన కథలో గత చిత్రాల్లో లేని ఓ కొత్తపాయింట్ ఆకర్షించింది. 'పాతతరం మనుషులు అంత తేలిగ్గా మారరు. తమవైన భ్రమల్లో ఉంటారు. అలాంటప్పుడు వారి దారిలోనే వెళ్లి మారిస్తే.." ఇదే ఆ కొత్త పాయింట్. సడన్ గా మరని వాళ్లకోసం 'సమరసింహా రెడ్డి"లో ఓ డైలాగ్ ఉంది. 'మీరు మారొచ్చు. మా పగలు మారవు" ఇదే..ఇన్ స్పిరేషన్ అంటూ తను కత్తి చిత్రం చేయటానికి ప్రేరణగా నిలిచిన విషయాలు చెప్పారు కళ్యాణ్ రామ్.