Don't Miss!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కళ్యాణ్ రామ్ 'ఓమ్' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలం నుంచి త్రీడి చిత్రం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై త్రీడీ స్టీరియోఫోనిక్ విధానంలో 'ఓం' చిత్రాన్ని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు . శనివారం రాత్రి ఈ చిత్రం ఆడియో విడుదల ఘనంగా జరిగింది.
ఈ చిత్రంతో ఛాయాగ్రాహకుడు సునీల్రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్ . అచ్చు, సాయికార్తీక్ స్వరాలు సమకూర్చారు. 'ఓమ్' చిత్ర గీతాల విడుదల కార్యక్రమానికి దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, శౌర్యారామ్, అచ్చు, సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రం ఆడియో హైలెట్స్ ..స్లైడ్ షోలో ...
కల్యాణ్రామ్ కుమార్తె అద్విత తొలి సీడీని విడుదల చేసింది. దాసరి అందుకున్నారు.
తాత,మనవలు
తండ్రి ఆశీర్వాదం తీసుకుంటూ...
సినీ కుటుంబ పెద్ద దీవెనలు అందుకుంటూ...
ఆడియో లాంచింగ్ ముచ్చటగా ఇలా...
ఎక్కడ చూసినా కళ్యాణ్ రామ్...ఓం
శ్రేయాభిలాషుల సమక్షంలో...ఆనంద హేల
''కల్యాణ్రామ్ ఒక త్రీడీ సినిమా చేయాలనుకున్నప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడలేదు. ఎక్కడెక్కడ అలాంటి గొప్పగొప్ప చిత్రాలు తీశారో తెలుసుకుని వారిని ఇక్కడికి రప్పించి సినిమా తీశాడు. ఎందుకంటే అతను నందమూరి వారసుడు'' అన్నారు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు.
అలాగే.. ''సినీ చరిత్రలో ఏ నటుడూ చేయని, చేయలేని పాత్రల్ని చేసిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. అందుకే వందేళ్ల సినీ చరిత్రలో ఆయనదే అగ్ర తాంబూలం. నేను ఎంతో మంది కళాకారులతో పని చేశాను. ప్రతి హీరో గురించి నాకు తెలుసు. కల్యాణ్రామ్ ఒక గొప్ప సినిమా చేయాలన్న తపనతో చేసిన చిత్రం ఓమ్. కథకి ఏది అవసరమో అది మాత్రమే తీశాడు. ఇలాంటి నాయకులు, నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరము''అన్నారు.
తాత,మనవరాళ్ల ముచ్చట్లే స్పెషల్ ఎట్రాక్షన్..
బిడ్డలిద్దరితో..కల్యాణ్ రామ్
కల్యాణ్రామ్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం నేను రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను. సాధారణంగా రెండున్నరేళ్లు ఒక నటుడు కనిపించకపోతే మన ఇండస్ట్రీలో వీడి పని అయిపోయింది అంటారు. కానీ నాకు ఆ భయం లేదు. మా అభిమానులు మంచి సినిమా తీస్తే ఎప్పుడైనా తప్పకుండా ఆదరిస్తారు. హాలీవుడ్లోనే త్రీడీ సినిమాలు చేయగలరా? మన ఆంధ్రులం తీయలేమా అన్న కసితో ఈ చిత్రాన్ని తీశాను. మా కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ నా వెంటే ఉంటారు. వెన్నెముక లేకపోతే నిలబడలేం. నా వెన్నెముక నా బావమరిది హరి. చిత్రాన్ని జూన్లో విడుదల చేయబోతున్నాము''అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''నా మీద నమ్మకంతో ఇంత పెద్ద సినిమా నా చేతుల్లో పెట్టినందుకు కల్యాణ్రామ్కి కృతజ్ఞతలు''అన్నారు.
నటుడు చలపతిరావు మాట్లాడుతూ ''హరికృష్ణలో ఉన్న మొండితనం, ఎన్టీఆర్లోని క్రమశిక్షణ కలిపి పోతపోస్తే కల్యాణ్రామ్. కొత్తదనం కోసం నిరంతరం తపించే కథానాయకుడీయన'' అన్నారు.
అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్ అప్3, ఫైనల్ డెస్టినేషన్, స్పైడర్మేన్4, అవతార్, రెసిడెంట్ ఈవిల్ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్ ఎపిక్, త్రీడీ రిగ్ కెమెరాలు, లెన్స్లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్ చేశాం. గత ఏడు నెలలుగా అమెరికా, సింగపూర్ల్లో త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి అని కళ్యాణ్ రామ్ చెప్పారు.