కాంచన... 30 ఏళ్ల తర్వాత ‘అర్జున్ రెడ్డి’ మూవీలో
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ నటి కాంచన నటించనున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ కి బామ్మగా కాంచన నటించబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











