చీటీల పేరుతో మోసం చేసిన నటుడు
బాధితులు బెంగళూరులోని కత్రిగుప్పెలో నివాసముంటున్న యశ్ ఇంటికి వెళ్లి చీటీ నగదు అడిగితే తనకు తెలియదని తప్పించుకుంటున్నాడని బాధితులు సోమవారం మీడియా ఎదుట వాపోయారు. దాదారు రెండు లక్షలు వరకూ బాకీలు ఉన్నాయని వారుచ అంటున్నారు. వారంతా బెంగుళూరులో యశ్ ఇంటికి వెళ్ళి నిలదీస్తున్నారు. తమను ఇంతలా ముంచుతాడని భావించలేదని, రేపో మాపో వచ్చి తమ బాకీలు తీరుస్తాడని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నామని వారు చెప్తున్నారు.
దీనిపై యశ్ వివరణ ఇస్తూ... కొందరు పరిశ్రమలోని వాళ్ళే తన ఇమేజ్ ని దెబ్బతీయటానికి ఈ కుట్ర పన్నారని అంటున్నాడు. ఎదుగుతున్న తనను దెబ్బ కొట్టాలని వారి తాపత్రయమని అన్నారు. కావాలని తమ ఊరి జనాల్ని రెచ్చ గొట్టి తీసుకువచ్చి తన ఇంటి పైకి వదిలారని అన్నారు. అలాగే వారు చెప్పేదంతా అబద్దమని, తాము ఎవరికీ డబ్బు ఎగ్గొట్టలేదని అన్నారు.
తాము చీటీల వ్యాపారం చేసింది మాత్రం నిజమేనని,తమ స్ధలాలు అమ్మి మరీ జనం బాకీ తీర్చామని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా లేనిది ఇప్పుడు తన మీదకు రావటం ఏమిటని అన్నారు. అలాగే తాను ఎప్పటికీ మీడియాకు దగ్గరగానే ఉంటానని,ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా ఏ క్షణమైనా రావచ్చునని అన్నారు.


Click it and Unblock the Notifications












