Don't Miss!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘కత్తి’ వివాదం: ఇరుక్కున్న రాంచరణ్ ఫ్యాన్స్...
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘కత్తి'. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో సరికొత్త వివాదాలకూ, చర్చకూ దారిస్తోంది. ‘కత్తి' కథ నాదే అంటూ నరసింహారావు అనే ఓ రచయిత గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ వివాదమై పూర్వాపరాలను పరిశీలించిన కథా హక్కుల సమాఖ్య రచయితకు మద్దతుగా నిలిచింది. ఆ సమస్య పరిష్కారం కాకుండానే ‘కత్తి'ని తెలుగులో రీమేక్ చేయాలనుకోవడంతో రచ్చ మళ్లీ మొదలైంది.
అయితే ఈ వివాదంలోకి దాసరి,చిరంజీవి, రామ్ చరణ్ వచ్చి పడ్డారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఉన్న సోషల్ మీడియా పేజీలో దాసరికి అశ్రు నివాళి అని రాసి వివాదం రాజేసారు. దాంతో ఇప్పుడు అది క్రై డిపార్టమెంట్ పరిధిలోకి వెళ్లింది.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ...‘‘చిరంజీవిగారి 150వ సినిమాకు దాసరిగారు అడ్డుపడుతున్నారంటూ అసత్య కథనాలు సోషల్ మీడియా, పలు వెబ్సైట్లలో ప్రచురించడం, ‘రాంచరణ్ ఫ్యాన్స్' పేర ఉన్న ఓ సోషల్ మీడియా పేజీలో దాసరికి అశ్రునివాళి అంటూ రాయడం బాధాకరం. ఇది ఎవరు చేశారన్నది సైబర్ క్రైం డిపార్ట్మెంట్ త్వరలోనే తెలియజేస్తుంది. వారికి శిక్ష తప్పదు. దాసరిగారికి, చిరంజీవిగారికి ఎటువంటి సంబంధం లేని సమస్య ఇది. వారిద్దరి మధ్య గొడవలు రేపేందుకు కుట్రలు చేస్తున్నారు'' అని చెప్పారు.
అలాగే...కొత్త కుర్రాడు కష్టపడి రాసుకున్న కథకు అన్యాయం జరిగితే అతని భవిష్యత్తు ఏంటన్న విషయంపై 16 మందితో కూడిన ఓ కమిటీతో దాసరి నారాయణరావుగారు ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతికారు. రచయితకు పరిహారంగా కొంత మొత్తంలో ఇవ్వాలని సూచించాం. ఇందుకు ఎన్వీ ప్రసాద్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇంతలోనే ఈ అసత్య కధనాలు వచ్చాయని అని ఆయన అన్నారు.
వీరశంకర్ కంటిన్యూ చేస్తూ...‘‘కత్తి' వివాదం పదహారు నెలల నుంచీ నలుగుతూనే ఉంది. ఓ దశలో తమిళ చిత్రసీమ నుంచి దర్శకుల బృందం వచ్చి కథా హక్కుల సమితి అధ్యక్షులు దాసరి నారాయణరావుగారితో సంప్రదింపులు జరిపారు. ‘నరసింహారావుకి న్యాయం చేస్తాం' అని మాటిచ్చారు. అయితే... ఆ మాట మరిచి మళ్లీ లీగల్ ఒపీనియన్ పంపించారు. నరసింహారావుకి న్యాయం జరిగేంత వరకూ ఈ పోరాటం ఆగదు''అన్నారు.
కథా హక్కుల సమితి ఉపాధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ‘‘కత్తి' రీమేక్ విషయంలో చిరంజీవి స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ‘కత్తి' కథపై ఉన్న వివాదం తీరాకే ఆ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్తామని చిరంజీవి చెప్పారు. మధ్యవర్తుల ద్వారా ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి''అన్నారు.