twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kushboo: అది మానవాళికి, స్త్రీ జాతికి అవమానం.. ఎమోషనల్​గా​ ఖుష్భూ ట్వీట్​

    |

    ఒకప్పటి స్టార్ హీరోయిన్​, నటి ఖుష్బూ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెంకటేష్​ నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్​కు హీరోయిన్​గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత కాలంలో తమిళంలో స్టార్​డమ్​ సంపాదించుకున్నారు. అనంతరం దర్శకుడు సుందర్​ను పెళ్లి చేసుకున్న ఖుష్భూ కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు పలు పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. అయితే తాజాగా 'బిల్కిస్​ బానో' గ్యాంగ్​ రేప్ నిందితులను విడుదల చేయడంపై ఖుష్బూ ఎమోషనల్​గా స్పందించారు.

    విక్టరీ వెంకటేష్​తో జోడీ కట్టిన ఖుష్బూ కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలో స్టార్​ హీరోయిన్​గా చక్రం తిప్పిన ఖష్బూ చిరంజీవి, నాగార్జున వంటి తదితర స్టార్​ హీరోలతో ఆడిపాడారు. తెలుగులోను ఏ స్పెషల్​ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు.

    గుడి కట్టిన ఫ్యాన్స్​..

    గుడి కట్టిన ఫ్యాన్స్​..

    వరుస సిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే దక్షిణాది స్టార్​ హీరోయిన్​గా ఒక వెలుగు వెలిగారు. ఇదిలా ఉంటే కోలీవుడ్​లో ఆమెకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమెను ఎంతగానే ఆరాధించే ఖుష్బూ ఫ్యాన్స్ ఆమె కోసం ఏకంగా గుడి కట్టించారు.

     ఎన్నికల్లో ఓటమి..

    ఎన్నికల్లో ఓటమి..

    దీంతో తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్​గా ఖుష్బూ రికార్డు సాధించారు. ఇక ఈ మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్​లో పోటీ చేసి ఓడిపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉండే ఖుష్బూ సామాజిక అంశాలపై, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటారు.

     స్వేచ్ఛగా తిరగకూడదు..

    స్వేచ్ఛగా తిరగకూడదు..

    తాజాగా బిల్కిస్​ బానో గ్యాంగ్​ రేప్​ నిందితులను ప్రభుత్వం విడిచిపెట్టడంపై ఖుష్బూ స్పందించారు. ''అత్యాచారం, దాడి, క్రూరత్వానికి బలి అయిన ఓ మహిళా తనకు జీవితంలో న్యాయం జరుగుతుందా? అని భయపడుతూనే ఉంటుంది. నిజానికి అత్యాచారం చేసిన వారిలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదు, బయట స్వేచ్ఛగా తిరగనివ్వకూడదు.

    మాతృమూర్తికి అవమానం..

    మాతృమూర్తికి అవమానం..

    ఒకవేళ అలా జరిగితే, మానవాళికి, స్త్రీ జాతికి అవమానం. బిల్కిస్​ బానోకు కానీ, ఇంకా ఏ మహిళకైనా అయినా సరే రాజకీయాలను, ఆదర్శాలను పక్కన పెట్టి అండగా నిలవాలి'' అని ట్విటర్​ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు ఖుష్బూ.

    ఐదు నెలల గర్భిణీపై రేప్​..

    ఐదు నెలల గర్భిణీపై రేప్​..

    2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్​లో జరిగిన అల్లర్లలో బిల్కిస్​ బానోపై 11 మంది గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు. ఆ సమయంలో బిల్కిస్ బానోస్​ ఐదు నెలల గర్భిణీ. అంతేకాకుండా బిల్కిస్​ కుటుంబంలో ఏడుగురిని చంపేశారు కూడా.

     క్షమాభిక్ష కింద విడుదల

    క్షమాభిక్ష కింద విడుదల

    ఆరేళ్ల విచారణ తర్వాత నేర నిర్ధారణ చేసిన సీబీఐ కోర్టు ఆ 11 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది కూడా. అయితే తాజాగా ఆగస్టు 15న క్షమాభిక్ష కింద ఆ 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం.

    ఎన్నికల కోసమేనా?

    ఎన్నికల కోసమేనా?

    వచ్చే సంవత్సరం గుజరాత్​లో ఎలక్షన్స్​ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఖైదీలను రిలీజ్​ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విడుదలకు నిర్ణయం తీసుకునే క్రమంలో 2012 సంవత్సంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ సూచనలను పట్టించుకోలేదని సమాచారం.

     సర్వత్రా విమర్శలు..

    సర్వత్రా విమర్శలు..

    గుజరాత్​ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. దోషులను విడుదల చేయడంపై బిల్కిస్​ బానో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే నటి, పొలిటిషియన్​ ఖుష్బూ ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

    English summary
    Politician Khushboo Reacts On 11 Convicts Of Bilkis Bano Case Set Them Free On Under Forgiveness. And Said Its An Insult To Human Kind And Womanhood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X