Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
Kushboo: అది మానవాళికి, స్త్రీ జాతికి అవమానం.. ఎమోషనల్గా ఖుష్భూ ట్వీట్
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి ఖుష్బూ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత కాలంలో తమిళంలో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అనంతరం దర్శకుడు సుందర్ను పెళ్లి చేసుకున్న ఖుష్భూ కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు పలు పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. అయితే తాజాగా 'బిల్కిస్ బానో' గ్యాంగ్ రేప్ నిందితులను విడుదల చేయడంపై ఖుష్బూ ఎమోషనల్గా స్పందించారు.
విక్టరీ వెంకటేష్తో జోడీ కట్టిన ఖుష్బూ కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఖష్బూ చిరంజీవి, నాగార్జున వంటి తదితర స్టార్ హీరోలతో ఆడిపాడారు. తెలుగులోను ఏ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
గుడి కట్టిన ఫ్యాన్స్..
వరుస సిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ఇదిలా ఉంటే కోలీవుడ్లో ఆమెకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమెను ఎంతగానే ఆరాధించే ఖుష్బూ ఫ్యాన్స్ ఆమె కోసం ఏకంగా గుడి కట్టించారు.
ఎన్నికల్లో ఓటమి..
దీంతో తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్గా ఖుష్బూ రికార్డు సాధించారు. ఇక ఈ మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఖుష్బూ సామాజిక అంశాలపై, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటారు.
స్వేచ్ఛగా తిరగకూడదు..
తాజాగా బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ నిందితులను ప్రభుత్వం విడిచిపెట్టడంపై ఖుష్బూ స్పందించారు. ''అత్యాచారం, దాడి, క్రూరత్వానికి బలి అయిన ఓ మహిళా తనకు జీవితంలో న్యాయం జరుగుతుందా? అని భయపడుతూనే ఉంటుంది. నిజానికి అత్యాచారం చేసిన వారిలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదు, బయట స్వేచ్ఛగా తిరగనివ్వకూడదు.
మాతృమూర్తికి అవమానం..
ఒకవేళ అలా జరిగితే, మానవాళికి, స్త్రీ జాతికి అవమానం. బిల్కిస్ బానోకు కానీ, ఇంకా ఏ మహిళకైనా అయినా సరే రాజకీయాలను, ఆదర్శాలను పక్కన పెట్టి అండగా నిలవాలి'' అని ట్విటర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు ఖుష్బూ.
ఐదు నెలల గర్భిణీపై రేప్..
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానోపై 11 మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఆ సమయంలో బిల్కిస్ బానోస్ ఐదు నెలల గర్భిణీ. అంతేకాకుండా బిల్కిస్ కుటుంబంలో ఏడుగురిని చంపేశారు కూడా.
క్షమాభిక్ష కింద విడుదల
ఆరేళ్ల విచారణ తర్వాత నేర నిర్ధారణ చేసిన సీబీఐ కోర్టు ఆ 11 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది కూడా. అయితే తాజాగా ఆగస్టు 15న క్షమాభిక్ష కింద ఆ 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం.
ఎన్నికల కోసమేనా?
వచ్చే సంవత్సరం గుజరాత్లో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఖైదీలను రిలీజ్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విడుదలకు నిర్ణయం తీసుకునే క్రమంలో 2012 సంవత్సంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ సూచనలను పట్టించుకోలేదని సమాచారం.
సర్వత్రా విమర్శలు..
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. దోషులను విడుదల చేయడంపై బిల్కిస్ బానో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే నటి, పొలిటిషియన్ ఖుష్బూ ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది.