Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలంగాణవారికి 40 శాతం దక్కాలి: కోదండరామ్
తెలంగాణవారికి 40 శాతం దక్కాలి. రాష్ట్ర ఆర్థిక రంగం మాదిరిగానే కొంత మంది సంపన్న వర్గాల గుత్తాధిపత్యంలో సినిమా పరిశ్రమ ఉంది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్నీ, కళల్నీ వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి. సినిమా పరిశ్రమకి సంబంధించి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, స్టూడియోలకు భూముల కేటాయింపులు, ఇతర సహాయ సహకారాలు తెలంగాణవారికి దక్కాలి. నేడు సినిమాల విడుదల పెద్ద సమస్యగా మారింది. జానపద ఇతివృత్తంతో రూపొందిన 'మైనావతి' ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు సహకరించాలి అని చెప్పారు.
తెలంగాణలోని గ్రామగ్రామాన వేళ్లూనుకున్న మైనావతి కథతో రూపుదిద్దుకున్న 'మైనావతి' చిత్రం ప్రాంతీయ భేదాలు లేకుండా తెలుగువాళ్లందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని తెలంగాణకు చెందిన ప్రజా నాయకులు, కళాకారులు వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు ఎర్రం వేణుగోపాల్ మాట్లాడుతూ అన్నిటికీ ఆధారమైన అమ్మ జీవితంలో ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నదనేది ఈ చిత్రంలోని ప్రధానాంశమన్నారు. ఈ చిత్రానికి 75 శాతం తెలంగాణ కళాకారులు పనిచేశారనీ, తొలి తెలంగాణ జానపద చిత్రమైన 'మైనావతి' ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత విజయ్ కుమార్ చెప్పారు.