టైం కావాలంటున్న కొరాటాల శివ, మహేష్ ఫ్యాన్స్ నిరాశ!
హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ న్యూఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. జనవరి 1న ఎలాంటి ఫస్ట్ లుక్ విడుదల చేయడం లేదు, ఆ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. బెస్ట్ లుక్ తో అభిమానుల ముందుకు రావాలంటే మరింత సమయం కావాలని తెలిపారు. అయితే శివ వ్యాఖ్యలపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏంటి భయ్యా ఇలా హాండిచ్చావ్ అంటూ కొందరు ట్వీట్ కేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక సినిమాకు సంబంధించిన విషయాల్లోకి వెళితే...ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.

ఈ చిత్రంలో ఓ సీన్ కోసం మహేష్ను షర్ట్ తీసి అర్ధనగ్నంగా నటించాలని కోరగా మహేష్ బాబు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మధ్య ‘మేమే సైతం' షోలో కూడా సమంత అడిగిన ఓ ప్రశ్నకు షర్టు లేకుండా నటించనని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











