Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరీ కి మెగా ఫ్యామిలీ ట్విస్ట్...క్రిష్ కు ప్లస్
చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నారనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఎవరై ఉంటారుఅనేది మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. మొదట శ్రీకాంత్ అడ్డాల ని అనుకున్నారు. కాని పర్శనల్ కారణాల వల్ల అతను తప్పుకోవటంతో పూరీ ని అనుకున్నారు. పూరీ వెళ్లి స్టోరీ నేరేట్ చేసారని కూడా వినపడింది. అయితే అనుకోని విధంగా ఈ మార్పు జరిగింది. అందుకే పూరీ హడావిడిగా నితిన్ తో హార్ట్ ఎటాక్ అనే చిత్రం ప్రకటించాడని అంటున్నారు.
ఇక రామ్చరణ్ని తెరపైకి తీసుకొచ్చిన వైజయంతి మూవీస్ ద్వారానే వరుణ్ తెరంగేట్రం జరగబోతోంది. ఈ సినిమాకి రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్ నిర్మాత. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. స్విట్జర్లాండ్, లండన్ల్లో కీలక సన్నివేశాల్ని రెండు నెలలపాటు చిత్రీకరిస్తారు.
ఆ తరవాత హైదరాబాద్, ముంబయిల్లో కొంతమేరకు షూటింగ్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ కు స్థానం ఉంది. త్వరలో ఎంపిక చేస్తారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తారు. రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాకు పలువురు బాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తారు. క్రిష్తో వైజయంతి మూవీస్ మూడు చిత్రాలు చేస్తుంది. అందులో మహేష్బాబుతో చేసే 'శివమ్' ఒకటి. ఆ చిత్రం వచ్చే యేడాది ద్వితీయార్థంలో సెట్స్పైకి వెళ్తుంది.