Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'కృష్ణం వందే జగద్గురుమ్' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: దగ్గుబాటి రాణా, నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేద్దామని ప్లాన్ చేసారు. అయితే ఊహించని విధంగా లేటు అవటంతో రిలీజ్ ని మార్చారు. క్రిష్ ఈ చిత్రం విషయమై మీడియాతో మాట్లాడుతూ...''సమాజంలోంచి అల్లుకొన్న కథ ఇది. సమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయి. వినోదం జోడించడం మర్చిపోలేదు. బీటెక్ బాబు, దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయి. '' అన్నారు.
తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రంలో వెంకటేష్,సమీరా రెడ్డి గెస్ట్ లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆడియో ఈ మద్యనే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక చిత్రం స్టోరీ గురించి క్రిష్ చెపుతూ... రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా బతకాల్సిందే అంటాడు బీటెక్ బాబు. పుస్తకాల కంటే లోకాన్నే అతను ఎక్కువగా చదివాడు. ఈ సంఘంలో బతకాలంటే 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనుకోవడంలో తప్పులేదని వాదిస్తాడు. అలా ఉండటాన్ని స్వార్థం అనడంలో అర్థం లేదన్నది అతని వాదన. అయితే బాబు ఆలోచనలు దేవికతో పరిచయం తరవాత మారాయి. అదెలాగో మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు క్రిష్.
అలాగే.. ఈ చిత్రం లాండ్ మాపియా నేఫధ్యంలో వాస్తవ సంఘటనలు ఇన్ కార్పోరేట్ చేస్తూ జరుగుతుంది.తమిళ నాడు, కర్ణాటక బోర్డర్ లో కథ జరుగుతుంది. ఈ సినిమాతో నేను ఓ కొత్త జనర్ ని ట్రై చేస్తున్నాను. ఈ చిత్రం ట్రావిల్ ఎడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో రాణా ధియోటర్ ఆర్టిస్టుగా, స్వార్ద పరుడుగా కనపిస్తే... నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా స్వార్దం లేని వ్యక్తిత్వంతో కనిపిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రాణా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.
ఈ చిత్రంలో రాణా పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ.