దక్షణాది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కుసేలన్' రిలీజ్ డేట్ ఫిక్సయింది. రజనీకాంత్ హీరోగా, వడివేలు, నయనతార, మీనా, స్నేహ తదితరులు నటిస్తున్న ఈ మళయాళ రీమేక్ చిత్రం జూలై 18 న విడుదల కానుంది. తమిళ,తెలుగు భాషలకు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రజనీ హీరోగా తెలుగులో 'కుచేలుడు' టైటిల్తోను, షారుఖ్ ఖాన్ హీరోగా హిందీలో 'బిల్లో బార్బర్' టైటిల్తోనూ నిర్మితమౌతుంది. తెలుగు వెర్షన్ లో జగపతి బాబు మెయిన్ పాత్ర చేస్తున్నారు. దాదాపు 40 కోట్లు వరకు ఈ చిత్ర నిర్మాణ వ్యయం ఉండవచ్చని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. అయితే ఈచిత్రం తెలుగు, తమిళ భాషలలో ప్రదర్శన హక్కులను 60 కోట్లు వెచ్చించి పిరమిడ్ సాయిమీరా గ్రూప్ స్వంతం చేసుకుంది. వారికీ పూర్తి స్ధాయిలో లాభాల పంట పండే అవకాసం ఉంది.
Story first published: Wednesday, April 22, 2026, 6:44 [IST]