twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ తేజ్ గుర్రం ఎక్కిన లక్ష్మీ ప్రసన్న....!

    By Sindhu
    |

    'మగధీర" లో నటించిన గుర్రం 'బాషా" ఇప్పుడో సెలబ్రిటీ. గుర్రపు స్వారీ వచ్చిన సినీ కుటుంబాల్లోని వారంతా ఒక్కసారయినా బాషాని ఎక్కి స్వారీ చేయాలని సరదా పడుతున్నారు. అలానే మోహన్ బాబు కూతురు కూడా బాషాపై ఎక్కి స్వారీ చేసింది. ఆ గుర్రంపై స్వారీ చాలా బాగుందనీ, ఆ గుర్రం చాలా వేగంగా పరిగెడతుందని, లక్ష్మీప్రసన్న మెచ్చుకుంది. ఈ గుర్రమెంతో స్పీడని చెబుతోందంటే లక్ష్మీ ప్రసన్నకి గుర్రాలతో పరిచయం ఎక్కువేననుకోవాలి.

    ఇదిలావుంటే లక్ష్మీప్రసన్న విలన్ గా నటించిన 'అనగనగా ఒక ధీరుడు" చిత్రం షూటింగ్ పూర్తయింది. సిద్దార్థ హీరోగా ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, ఎన్నో గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానని, చాలా దెబ్బలు కూడా తగిలించుకున్నానని మంచు లక్ష్మీ చెప్పు కొచ్చింది. ఈ సినిమా తర్వాత తనకు నటిగా అవకాశాలు పెరుగుతాయని ఆమె అంటోంది. ఝుమ్మంది నాదం సినిమా తర్వాత మరో చిత్రాన్ని నిర్మించకుండా లక్ష్మీ మళ్లీ టాక్ షోలు చేసుకుంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X