టచ్ చేసి చూడు అంటున్న లావణ్య త్రిపాఠి
రవితేజ తాజా చిత్రంలో మరో హీరోయిన్గా లావ్యణ త్రిపాఠి ఎంపికయ్యారు.
భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు, శుభమస్తు లాంటి హిట్ చిత్రాలతో మంచి ఊపుమీద ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా మరో మంచి అవకాశాన్ని సొంతం చేసుకొన్నది. మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం టచ్ చేసి చూడులో మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని నిర్మాతలు ఎంపిక చేశారు.

ఇప్పటికే ఈ చిత్రంలో రవితేజ సరసన నటించే అవకాశాన్ని రాశీఖన్నా దక్కించుకొన్నది. పలు చిత్రాలకు లక్కీ మస్కట్గా మారిన లావణ్య త్రిపాఠి రవితేజకు కూడా హిట్ను అందిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. రవితేజ తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











