Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎం.ఎస్. ధోని పై సినిమా..టీజర్ ఇదిగో (వీడియో)
ముంబయి: బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా క్రికెటర్ ఎం.ఎస్. ధోని జీవితచరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఎం.ఎస్. ధోని' ది అన్టోల్డ్ స్టోరీ అనే ట్యాగ్లైన్తో వస్తోంది. ఈ చిత్రం టీజర్ను విడుదల చేసినట్లు సుషాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం టీజర్ పోస్టర్ను సుషాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వ్యక్తి మీకు తెలుసు.. కానీ ఆయన ప్రయాణం మీకు తెలియదు. ఈ కథను తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది అంటూ ట్వీట్ చేశారు.
ఈ చిత్రం షూటింగ్ ఖరగ్పూర్లో మొదలైంది. చిత్రం మొదటి సన్నివేశాన్ని రైల్వే కార్యాలయం వద్ద తీశారు. ధోని భారత క్రికెట్ జట్టులోకి రాక ముందు రైల్వే టీటీఈగా పనిచేయడమే ఇందుకు కారణం. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోని పాత్రలో హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నారు. చిత్రంలో అప్పటి ధోని సహచరులు నటించనున్నారు.

నీరజ్పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ పాండే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ధోని భార్య సాక్షి ధోని పాత్రలో కైరా అద్వానీ, యువరాజ్ సింగ్ పాత్రలో హెర్రీ టంగ్రీ, ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, భూమిక, దిశా పటానీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న' ధోని' చిత్రంలో ధోనికి తండ్రి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ధోని చిత్రంలో మీ పాత్ర ఏమిటి అని అభిమానులు అడిగిన ప్రశ్నకు ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు.