Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'మా' స్టార్ క్రికెట్ ఎప్పుడు..ఎక్కడ?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మరోసారి స్టార్ క్రికెట్ నిర్వహించనుంది. జూన్ 13న హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో 'టి20 టాలీవుడ్ ట్రోఫీ' పేరుతో స్టార్ క్రికెట్ ను నిర్వహించనుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ జట్లు ఈ కిక్రెట్ మ్యాచ్లు ఆడతాయి. ఈ విషయంపై హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఈ మ్యాచ్ల్లో పాల్గొనడం సంతోషాన్ని కలిగించే అంశం. ఈ మ్యాచ్ లన్నీ ఆషామాషీగా కాకుండా యుద్ధంలా జరుగుతాయి. మే 15న టీమ్స్ సెలక్షన్, మే 30న డ్రస్ లాంచ్ ఉంటాయి' అన్నారు.
ఇక 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలియజేస్తూ, 'మా'కు సొంత భవన నిర్మాణం, పేద కళాకారులకు సహాయ పడే ఉద్దేశంతో ఈ స్టార్ క్రికెట్ను నిర్వహించనున్నాం. జూన్ 13 ఉదయం 9 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు క్రికెట్ మ్యాచ్ లు, వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులందరూ ఇందులో పాల్గొంటారు. రిథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా స్టేడియంలో యాంటీ పైరసీ రన్ కూడా ఉంటుంది' అన్నారు. ఈ సమావేశంలో సిద్ధార్థ, తరుణ్, సుశాంత్, ఆహుతి ప్రసాద్, శివాజీరాజా, గౌతంరాజు, మహర్షి, రిథమ్ విష్ణు, రవి, శేఖర్ పాల్గొన్నారు.