షూటింగులో ఇద్దరు బలి: ఎట్టకేలకు ‘మాస్తి గుడి’ ట్రైలర్ రిలీజ్
బెంగులూరు: కన్నడ హీరో దనియా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'మాస్తిగుడి' సినిమా షూటింగులో ప్రమాదం చోటు చేసుకోవడం, మూవీ క్లైమాక్స్ చిత్రీకరణలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఇద్దరు నటులు అనిల్, ఉదయ్ మరణించిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ మొదటి వారంలో ఈ ప్రమాదం సంభవించింది.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ ట్రైలర్ రిలీజైంది.
ప్రమాదం జరిగింది ఇలా....
షూటింగ్లో భాగంగా బెంగళూరు సమీపంలోని తిప్పగొండనహళ్లి లేక్లో హెలికాప్టర్ పైనుంచి దూకే సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన జాతీయ విపత్తు సహాయక దళం బృందాలు, గజ ఈతగాళ్లు ఇలా మొత్తం 50 మందికిపైగా గాలింపులో పాల్గొన్ని ఉదయ్, అనిల్ మృత దేహాలు వెలికి తీసారు. అనిల్ మృతదేహం నాలుగు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో లభించింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో దర్శక నిర్మాతలు, స్టంట్ మాస్టర్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications











