Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘స్పైడర్’ కోసం కిలికి భాష రైటర్ మదన్ కార్కీ తెలుగు పాట
ఇప్పుడు సూపర్ స్టార్ కి రాయబోతున్న ఈ పాట తెలుగులో మధన్ రాస్తున్న మొదటి తెలుగు పాట అవ్వడం విశేషం.
బాహుబలి సినిమా మొదటి భాగంలో కాలాకేయ మాట్లాడినా కిలికీ భాష కేవలం ఆ సినిమా కోసమే కనుగొన్నారు. ఈ కల్పిత కొండ భాషను కనిపెట్టడంలో ముఖ్య పాత్ర వహించినది తమిళ్ మాటల రచయత - గేయరచయత మధన్ కర్కీ. ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఒక పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ కి రాయబోతున్న ఈ పాట తెలుగులో మధన్ రాస్తున్న మొదటి తెలుగు పాట అవ్వడం విశేషం.
వేరే భాషలో పాట రాశాడు
ఇతర భాషల్లో మాట్లాడటమే కష్టం అలాంటి మదన్ ఏకంగా వేరే భాషలో పాట రాశాడు.మురుగదాస్ దర్శకత్వంతో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాతో తెలుగును గేయ రచయితగా పరిచయం అవుతున్నాడు మదన్ కార్కీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Recommended Video
స్పైడర్ సెప్టెంబర్ 27న
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. స్పైడర్ సినిమా షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న దసరా కానుకుగా రాబోతుంది.
మహేశ్ సినిమాకు పాట
విడుదల తేది కూడా ఒకటి ఫిక్స్ చేసిన తరువాత కొత్తగా ఒక పాట కోసం ఇప్పుడు మధన్ ను అడగడం కొత్త ఆసక్తిరేపింది. మధన్ మాట్లాడుతూ " మహేశ్ సినిమాకు పాట రాసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ మురుగదాస్ గారికి నా కృతజ్ఞతలు.
రకుల్ ప్రీత్ సింగ్
నా పై వాళ్ళ పెట్టుకున్న నమ్మకాన్ని మహేశ్ బాబు పై అభిమానులు పెట్టుకున్న ఆశలను దృష్టిలో పెట్టుకొని పాట రాస్తాను" అని అన్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ సినిమాలో మరో స్టార్ డైరెక్టర్ యెస్.జె. సూర్య ప్రతినాయకుడు గా నటిస్తున్నాడు. స్పైడర్ సినిమాకు సంగీతం హరీష్ జయ రాజ్ సమకూరుస్తున్నాడు.