Don't Miss!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆమెకు కూడా వర్మ నుంచి పిలుపు
వరసపెట్టి తెలుగు ప్లాప్ హీరోయిన్స్ ని అందరినీ వర్మ బాలీవుడ్ కి దిగుమతి చేసే స్కీమ్ లో ఉన్నట్లున్నాడు.తాజాగా ఆ లిస్ట్ లో మధుశాలిని చేరింది.తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇక్కడ అవకాశాలు కరవయ్యాయి.పోనీ తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'వాడు-వీడు'చిత్రం అయినా కెరీర్ పరంగా కిక్ ఇస్తుంది అనుకుంటే అదీ కనపడలేదు. ఈ నేపధ్యంలో ఆమె దిగాలుగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నుంచి పిలువు వచ్చింది.రామ్గోపాల్ వర్మ కొత్త చిత్రం 'డిపార్ట్మెంట్'లో ఆమెకు చోటిచ్చాడు.ఆ చిత్రంలో మధుశాలిని మాఫియా ముఠా సభ్యురాలిగా కనిపిస్తుందని సమాచారం.దాంతో ఇప్పటికే ఆ చిత్రంలో 'డాన్ శీను'లో నటించిన అంజనా సుఖానీకి,మంచు లక్ష్మి ప్రసన్నకు అవకాశమిచ్చాడు.ఇంకా ఎందరు ఈ సినిమాలోకి వస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలను అమితాబ్బచ్చన్, సంజయ్దత్, దగ్గుబాటి రానాలు చేస్తున్నారు.