Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కోర్టులో నటుడు ధనుష్కు చుక్కెదురు.. కేసు ఏమౌతుందో...
మద్రాస్ హైకోర్టులో సినీ నటుడు ధనుష్కు చుక్కెదురైంది. ధనుష్ తమ కొడుకు అని మధురై జిల్లా మేలూరు మలమట్టికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మేలూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో
మద్రాస్ హైకోర్టులో సినీ నటుడు ధనుష్కు చుక్కెదురైంది. ధనుష్ తమ కొడుకు అని మధురై జిల్లా మేలూరు మలమట్టికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మేలూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమ పోషణ నిమ్మిత్తం ధనుష్ నుంచి నెలకు రూ.65 వేలు ఇప్పించాలని ఫిర్యాదులో కోరారు.
ఈ నేపథ్యంలో ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ నటుడు ధనుష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు పలుమార్లు విచారించింది. తాజాగా స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు.
ఈ క్రమంలో నకలు కాపీలకు బదులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వచ్చే 17వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఈ సర్టిఫికెట్లను స్వీకరించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది.