Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహేష్ బాబు వల్లే బాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న క్రిష్
హైదరాబాద్: గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్దురుమ్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ క్రిష్. తర్వాత బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకుని సక్సెస్ అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘కంచె' ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతోంది.
మహేష్ బాబుతో కూడా క్రిష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా ప్రారంభం కాలేదు. అదే సమయంలోనే అతడికి బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నుండి పిలుపు వచ్చింది. తెలుగులో సూపర్ హిట్టయిన ‘ఠాగూర్' చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ‘గబ్బర్' చిత్రంగా తెరకెక్కింది. అక్షయ్ కుమార్ కెరీర్లో ఈచిత్రం ఎబో యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది.
మహేష్ బాబు, నమ్రత వల్లే తనకు బాలీవుడ్ మూవీ ‘గబ్బర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కిందని అంటున్నాడు క్రిష్. ఆ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సబీనా ఖాన్ కు తన పేరును రికమండ్ చేసింది నమ్రత, మహేష్ బాబే అంట. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించారు.
తన తాజా సినిమా ‘కంచె' చిత్రానికి కూడా మహేష్ బాబు సపోర్టుగా నిలిచాడు. కంచె సినిమా టీజర్ విడుదలైన తర్వాత చాలా బావుందంటూ ట్వీట్ చేసారు. చరణ్, బన్నీ, ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు కూడా కంచె చిత్రం టీజర్ అదిరిపోయిందంటూ ప్రశంసించారు. దీంతో ‘కంచె' సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంచె' చిత్రం ఈ నెల 22న దసరా కానుకగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని యూఎస్ఏలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 130కి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘అఖిల్' చిత్రం దసరా బరి నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో అక్టోబర్ 22న వరుణ్ తేజ్ సినిమా ‘కంచె' విడుదలవుతోంది. వాస్తవానికి అక్టోబర్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో నవంబర్ 6కు వాయిదా పడింది. అయితే పరిస్థితులు కలిసి రావడంతో అనుకున్న దానికంటే ముందే కంచె రిలీజ్ అవుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ‘కంచె'. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.