Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు ఫ్యామిలీతో ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? (ఫోటోస్)
'భరత్ అనే నేను' చిత్రం బ్లాక్ బస్ట్ హిట్ కొట్టడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయారు. నిన్నమొన్నటి వరకు సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపిన ఆయన ఐదు రోజుల క్రితమే ఫ్యామిలీతో కలిసి పారిస్లో వాలిపోయారు. ఐఫిల్ టవర్తో పాటు వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ హాట్ సమ్మర్ను కూల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా రిలీజ్ ముందే పారిస్కు షార్ట్ హాలిడే వెళ్లి వచ్చారు మహేష్. గ్యాప్ లేకుండా సాగిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలతో బుర్రహీటెక్కడంతో రిలాక్స్ అయి వచ్చిన ఆయన సినిమా హిట్ టాక్ కావడంతో పారిస్కు లాంగ్ హాలిడే ప్లాన్ చేసుకున్నారు.
|
మహేష్ బాబు, సితార
కూతురు సితారతో కలిసి పారిస్ వెళుతూ మహేష్ బాబు. ఈ ఫోటోలను మహేష్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్టు చేశారు.
|
పిల్లలతో కలిసి పారిస్ వీధుల్లో....
మహేష్ బాబు లాంటి స్టార్ సెలబ్రిటీలు ఇండియాలో తమ పిల్లలతో కలిసి వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం అసాధ్యం. సూపర్ స్టార్ హోదాలో ఉన్నవారు ఇలాంటి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవాలంటే పారిస్ లాంటి నగరాలు బెస్ట్ ఆప్షన్.
|
గౌతమ్, సితార
పారిస్లోని ఓ పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతూ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ....
|
ఐఫిల్ టవర్ వద్ద
పారిస్లోని ఐఫిల్ టవర్ వద్ద కూతురు సితారలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నమ్రత శిరోద్కర్.