పొంగిపోలేదు, కృంగిపోలేదు: మహేష్ అండ్ ఫ్యామిలీ ఇపుడు ఇలా... (ఫోటోస్)
మహేష్ బాబు ప్రస్తుతం ఇటలీ వెకేషన్లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి అక్కడ రిలాక్స్ అవుతున్నారు.
కొన్ని రోజులుగా మహేష్ బాబు సినిమాలకు బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. గతేడాది వచ్చిన 'బ్రహ్మోత్సవం' మహేష్ బాబు కెరీర్లో పెద్ద ప్లాపుగా నిలిచింది. ఈ ఏడాది వచ్చిన 'స్పైడర్' మూవీ కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మహేష్ బాబు కెరీర్ ముందుకు సాగతుంది అనేది ఎవరూ కాదనలేని సత్యం.
జయాపజయాలు మన చేతుల్లో ఉండవు, మనం చేయాల్సిందల్లా మనం నమ్మిన పనిని సిన్సియర్ గా చేయడమే అని చెప్పే మహేష్ బాబు.... సినిమా హిట్టయిందని ఎప్పుడూ పొంగి పోలేదు, అదే సమయంలో ప్లాపయిందని కృంగి పోలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఎప్పటిలాగే వెకేషన్
ప్రతి సినిమా షూటింగ్ అనంతరం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెల్లే మహేష్ బాబు ‘స్పైడర్' సినిమా అనంతరం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన తన ఫ్యామిలీతో ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
Recommended Video


ఫోటోస్ పోస్టు చేసిన నమ్రత
తమ టుస్కానీ ట్రిప్పుకు సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అక్కడ రోడ్ ట్రిప్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు.

గౌతమ్, సితార
టుస్కానీలోని ఓ ప్రాంతంలో కివి పండ్ల చెట్టుకింద గౌతమ్, సితార.

సితార
ఇటలీ టుస్కానీ ట్రిప్పులో అమ్మా, నాన్న, అన్నయ్యతో కలిసి సితార. అయితే ఫోటోలు అంటే పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు మాత్రం ఎప్పటిలాగే కెమెరా వెనకే ఉండిపోయారు.


Click it and Unblock the Notifications











