Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్, పవన్ ఫ్యాన్స్ వార్: ఫ్లెక్సీల కోసం రక్తం కళ్ళ చూసుకున్నారు
ఒక హీరో పై ఉన్న అభిమానం సాటి మనుషుల మీద ద్వేషంగా మారకూడదు. అభిమానం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ అదే దురభిమానం అయితే మనిషి ని ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ ఒక్క అభిమనినేనా.
ఒక హీరో పై ఉన్న అభిమానం సాటి మనుషుల మీద ద్వేషంగా మారకూడదు. అభిమానం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ అదే దురభిమానం అయితే మనిషి ని ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ ఒక్క అభిమనినేనా. అతడు ఎవరి కోసమైతే అంతకు తెగబడ్డాడో ఆ హీరోకి కూడా చెడ్డ పేరే కదా. కొన్ని నేలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పరస్పరం గొడవపడి. ఒక హీరో అభిఒమానిని పొడిచి చంపిన విషయం ఇంకా మరచిపోనే లేదు, భీమవరం లో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ గొడవ చిన్న స్థాయి యుద్దం రేంజి లో జరిగిన విషయమూ ఇంకా మరుగున పడలేదు...
తాజాగా అలాంటి రచ్చే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపు పెను ఘర్షణకు తావిచ్చింది. ఊరేగింపులో భాగంగా మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తారా జువ్వలు.. టపాసుల్ని కాల్చారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసమైంది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఫీల్ కావటంతో వాతావరణం రచ్చ రచ్చగా మారింది.
ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి రాళ్లు రువ్వుకోవటం.. సోడా సీసాలు విసురుకోవటం వెళ్లింది. దీంతో.. రెండు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరస్పర దాడులతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవటమే కాదు.. రక్తం చిందేలా చేసింది. చివరకు గ్రామస్తులు కలుగజేసుకొని ఇరు వర్గాల ఫ్యాన్స్ ను శాంతింపచేశారు. అయితే.. ఈ గొడవల కారణంగా ఆరుగురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.