Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబుకు పోటా పోటినా..!?
'అతిథి" తర్వాత మహేష్ నటించిన చిత్రం ఇప్పటివరకూ విడుదల కాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలా గ్యాప్ తీసుకోవడానికి కారణాలు... అలాగే కొన్ని మనోభావాలను ఇటీవల ఓ సందర్భంలో ఈ విధంగా పంచుకున్నారు మహేష్. అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చనిపోయిన ప్రభావం నా మీద చాలా పడింది. ఆ షాక్ నుంచి కొంచెంకొంచెం తేరుకుంటున్నాను అనుకుంటున్న సమయంలో నమ్రత తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో మా మానసిక పరిస్థితి చాల దారుణంగా ఉండేది. ఆ ప్రభావం'ఖలేజా"పై పడింది. కానీ ప్రేక్షకులకు నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. 'ఖలేజా" ఎవర్నీ నిరాశపరచదు. సినిమా బాగా వచ్చింది. అలాగే ఇక నుంచి సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ వివరించారు.
ప్రిన్స్ మహేష్ బాబు తన పుట్టినరోజు వేడుకలను ఆగస్ట్ 9న అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అలాగే తమ కొడుకు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ దంపతులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆగస్ట్ 31వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు తన తనయుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బర్త్ డే వేడుకను మాత్రం గోవాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కృష్ణ దంపతులు తమ కొడుకు పుట్టినరోజుకు ఘనంగా చేస్తే... మహేష్ దంపతులు తమ కొడుకు పుట్టినరోజును అంతకంటే ఘనంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచరం.