Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సచిన్ కోసం మహేష్ బాబు కూడా..!
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇటీవల సచిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించగానే ఆయ అభిమానులంతా ఒక్కసారి షాకయ్యారు. ఇక మళ్లీ ఆయన ఆటను స్వయంగా చూసే అవకాశం లేక పోవడంతో...సచిన్ ఆడబోతున్న చివరి టెస్టు మ్యాచ్ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
సచిన్ అభిమానుల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ నెల 14 నుంచి 18 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ ఆడే చివరి టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా సినిమా '1-నేనొక్కడినే' షూటింగులో భాగంగా గోవాలో ఉన్నారు. అటు నుండి నేరుగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబుతో పాటు మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సచిన్ ఆడే చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు వెలుతున్నారు. సచిన్ ఆడే మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు భారీగా ఎగబడుతుండటంతో ఆన్ లైన్లో టికెట్లు విక్రయించే వెబ్ సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది.