Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ తో 'పడ్డాను నీతో ప్రేమలో' అంటున్న సమంత
'గురువారం మార్చి ఒకటి...ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ...పడ్డాను నీతో ప్రేమలో..."అంటూ పాటలు పాడుతోంది సమంత. ఈ పల్లవితో సాగే పాటను రామజోగయ్య శాస్ర్తీ రాయగా, శోభి నృత్యదర్శకత్వంలో టర్కీలోని ఇస్తాంబుల్లో మహేష్ బాబు, సమంతపై ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 14రీల్స్ పతాకంపై రామ్, అనిల్, గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న 'దూకుడు" చిత్రం కోసం ఆదివారం నుంచి ఈ మెలోడీ పాటను తెరకెక్కిస్తున్నారు. పదిహేను రోజులపాటు అక్కడ ఈ షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ సమకూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.