మహేష్ బాబు తనయుడికి ఆంటీ ఫిదా
హైదరాబాద్: 1 నేనొక్కడినే సినిమాలో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో మహేష్ బాబు తనయుడు గౌతం నటించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు అభిమానులు గౌతమ్ను ప్రిన్స్గా అభివర్ణిస్తున్నారు. తండ్రి ప్రిన్స్ బిరుదును అతను కొట్టిసినట్లే కనిపిస్తున్నాడు.
ఆంటీ శిల్పా శిరోద్కర్ గౌతం నటనకు ఫిదా అయిపోయినట్లు కనిపిస్తోంది. ప్రిన్స్ గౌతం యాక్షన్ అద్భుతమైని, అతని ఎక్స్ప్రెషన్స్ మైండో బ్లోయింగ్ అని ఆమె వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన వ్యాఖ్యలను ఆమె ట్విట్టర్లో పోస్టు చేసింది.

మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా గౌతం నటనకు ఫిదా అయిపోయారు. ఈ మేరకు వారు ట్వీట్స్ పోస్టు చేశారు. మహేష్ బాబు కొడుకు ప్రిన్స్ గౌతం కుమ్మేశాడని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు. గౌతం సూపర్ క్యూట్ అని మరొకర వ్యాఖ్యానించారు.
మహేష్ బాబును మెచ్చుకుంటూనే లిటిల్స్ ప్రిన్స్ క్యూట్, ముద్దులు అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. సూపర్బ్ పెర్ఫార్మెన్స్ బై ప్రిన్స్ గౌతం అంటూ మరో అభిమాని వ్యాఖ్యానించారు. తొలి సినిమాలోనే గౌతం ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేశాడు. ఇది తండ్రిగా మహేష్ బాబుకు కూడా ఆనందకరమైన విషయమే కదా..


Click it and Unblock the Notifications











